http://apvarthalu.com/

Sunday, November 4, 2012

ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా రాజీనామా

'పదహారేళ్లపా టు ఎన్టీఆర్ పెట్టి న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్నా.. ఎన్నో అవమానాలు భరించా.. ఆర్థ్ధిక ఇబ్బందులకు గురయ్యా.. నేను పోరాటం చేసేందుకు తగిన వేదిక కూడా దొరకలేదు.. ఎటూ పాలుపోలేక కొన్నిసార్లు నిస్తేజంగా ఉండిపోయాను.. వీటన్నింటితో వేగలేకే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తు న్నా..' అని లక్ష్మీపార్వతి ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె శనివా రం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలిపారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను సమర్పిస్తున్నానని, లేఖ ప్రతిని పార్టీ ప్ర ధాన కార్యదర్శికి పంపానని, అలాగే న్యాయవాది సలహా తీసుకుని ర్రాష్ట ఎన్నికల సంఘానికి కూడా పంపనున్న ట్లు ఆమె వెల్లడించారు. 1996లో ఎన్టీఆర్‌కు అన్యాయంచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడున్న టీడీ పీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని, చంద్రబాబు టీడీపీ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌పై నేరుగా పోరాటానికే వైసీపీని స్థాపించారని, తన ఉద్దేశం కూడా అదేనని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించానన్నారు. ఆ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానన్నా రు. ఎన్టీఆర్ పార్టీకి రాజీనామా చేయడం ద్వా రా మీరు కూడా ఎన్టీఆర్‌కు నమ్మకద్రో హం చేసినట్టు కాదా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానాన్ని దాటవేశారు.

No comments: