http://apvarthalu.com/

Saturday, November 17, 2012

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ...దిగ్విజయ్ సింగ్‌

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి బాధ్యతలు దిగ్విజయ్ సింగ్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్విజయ్‌కు శనివారంనాడు పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పూలగుచ్ఛం ఇవ్వడాన్నిబట్టి ఢిల్లీ రాజకీయ పరిశీలకులలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ వ్యవహారాన్ని త్వరగా తేల్చండి అని కాంగ్రెస్ నాయకులు పాల్వాయి, గండ్ర, చెంగారెడ్డి శనివారంనాడు దిగ్విజయ్‌ను కోరారు. కాబోయే ఇన్‌ఛార్జి దిగ్విజయ్ అని తెలిసిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పెక్కుమంది నాయకులు దిగ్విజయ్ ఇంటికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తనను కలుస్తున్నవారినుంచి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.

No comments: