http://apvarthalu.com/

Wednesday, December 12, 2012

యువరాజ్‌ ఓ ప్రత్యేకమైన పుట్టిన రోజు 12-12-12

క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు ఈరోజు ఓ ప్రత్యేకమైనది. ఆయన పుట్టిన రోజు డిసెంబరు 12 కావడం, మూడు పన్నెండులు రావడం, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు కావడంతో ఈరోజు యువీకి ప్రత్యేకమైన పుట్టిన రోజుగానే చెప్పవచ్చు. ఈరోజుతో యువీకి 31 ఏళ్లు నిండుతాయి. క్యాన్సర్‌ నంచి కోలుకున్న తరువాత ఆయన జరపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆయన కుటుంబసభ్యులే కాదు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన వ్యక్తిగా యువరాజ్‌ ఇప్పుడు ఆ వ్యాధిపై అవగాహన పెంచడానికి తన పుట్టిన రోజును కేటాయిస్తున్నాడు. యూ వుయ్‌ కెన్‌ పేరుతో తాను ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. స్నేహితులు తనకు మద్దతు ఇవావ్లని యువరాజ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Saturday, December 8, 2012

టాలీవుడ్ పై డ్రగ్స్ మత్తు!

ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం.. నేడు మాదకవూదవ్యాలకు అడ్డాగా మారింది. రోజు ఎక్కడో ఓ చోట డ్రగ్స్ వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస వివాదాలతో సతమవుతున్న సినిమా పరిశ్రమ డ్రగ్స్ కలకలంతో తలెత్తుకోలేకపోతోంది. యువత శక్తిని నిర్వీరం చేస్తున్న మాదక ద్రవ్యాలు సినిమా పరిశ్రమను వదల్లేదు. గ్లామర్ రంగంలో ఉన్న యువత సులభంగా డ్రగ్స్ కు అలవాటవుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు, యువ హీరోలు, హీరోయిన్లు, శ్రీమంతుల బిడ్డలు ఈ విష కౌగిలిలో చిక్కి పతనమైపోతున్నారు. ఖరీదైన హోటళ్లు, పబ్ లు, రిస్టార్టులు కేంద్రాలుగా డ్రగ్స్ చెలామణి అవుతున్నాయి. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని మాయా వలలు విసురుతున్నారు. పాశ్చాత్య మోజులో కొట్టుకుపోతున్న యువతను మత్తుకు ఈజీగా గులాములవుతున్నాయి. ఒక్కసారి ఈ వ్యసనానికి అలవాటుపడిన వారు బానిసలు మారుతున్నారు. red more

సాక్షికి మేత..సంబరాల్లో జగన్ పార్టీ

చంద్రబాబు నాయుడు – కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రజా బలం లేక చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఖాయమని, అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అని విలీనం కావడం ఖాయం అని చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఎఫ్ డీ ఐలకు సంబంధించి ఓటింగ్ లో పాల్గొనాల్సిన టీడీపీ ఎంపీలు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణిలు గైర్హాజరు కావడంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీలు ఆత్మ రక్షణలో పడిపోయారు.red more

తెలంగాణపై బాబు, జగన్ ఇరుక్కుపోయారా...

తెలంగాణపై ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న అఖిలపక్ష సమావేశాన్ని డిసెంబర్ 28న ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఏం చెబుతుందన్నది పక్కన పెడితే, ఇప్పుడు అతిపెద్ద సమస్య టీడీపీ, వైఎస్సార్ సీపీలకే. అఖిలపక్ష సమావేశాన్ని పెడితే, తమ పార్టీ తరపున ఒక్కరినే పంపి స్పష్టమైన అభిప్రాయం చెబుతామంటూ పాదయాత్రకు ముందే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాద్యత ఆయనపై ఉంది. మాట తప్పుదామంటే, తెలంగాణలో పాదయాత్ర చేస్తూ చంద్రబాబు ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లో సాగుతున్న ఆయనయాత్ర డిసెంబర్ 28 నాటికి ఇంకా తెలంగాణలోనే కొనసాగే అవకాశం ఉంది. అలాంటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అఖిలపక్షంలో నిర్ణయం ప్రకటిస్తే, పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అటు చంద్రబాబు రూట్లోనే పాదయాత్ర చేసుకొస్తున్న షర్మిల కూడా ఆ సమయానికి తెలంగాణలోనే ఉండొచ్చుred more

Monday, December 3, 2012

1000 కి.మీ పూర్తి చేసుకొన్న…వస్తున్నా…మీకోసం


సోమవారం ఉదయం జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండ పంటక్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు పెంటాఖుర్దులో 1000 కి.మీ మైలు రాయిని దాటారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపై మొదటి సంతకం, బెల్లు షాపుల రద్దుపై రెండో సంతకం ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ జిల్లాలో నిజాంసాగర్, మంజీరా ఉన్నా మంచినీళ్లకు తీవ్ర కొరత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ‘మంచినీళ్లు నిల్, మద్యం ఫుల్’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర మంచినీటి పథకాలు పెట్టి అన్ని గ్రామాలు, తండాలకు ఎన్టీఆర్ సృజల అనే కార్యక్రమంతో మంచినీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇవ్వదలిచామని ఆయన తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు ఉన్నా న్యాయం జరగలేదన్నారు.red more

Saturday, December 1, 2012

నిజంగా ప్రేమించడం అంటే ఏంటో!


ప్రియమైన సాటి ప్రేమికులందరికీ ప్రేమపూర్వక సుస్వాగతం... ఈ రోజుల్లో చాల మంది ప్రేమికులు తాము ప్రేమిస్తున్నామనే భావనలో ఉంటున్నారేకానీ నిజంగా ప్రేమించడం లేదు దాని చాల కారణాలు ఉన్నాయి..
వారికి నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలియకపోవడం, ఎలా ప్రేమించాలో తెలియకపోవడం, ప్రేమిస్తే ఎం చేయాలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం. ప్రేమలో ఎదుటి వాళ్ళు మన నుండి ఏం ఆశిస్తారో తెలియకపోవడం
ఇలా చాల కారణాలు ఉండొచ్చు...అలా అని వారి ప్రేమ స్వచ్చమైనది కాదు అని నేను అనను.. కానీ ప్రేమంటే పూర్తిగా తెలియకపోవడం వల్లనే వారి మద్య గొడవలు, అలకలు, విడిపోవడాలు జరుగుతున్నాయి.. ప్రేమలో ఎంత ఆనందం ఉంటుందో దానిలో తేడాలు వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ నరకం కనిపిస్తుంది..ఆలాంటి బాధని ఏ ప్రేమికులు అనుభవించకూడదు అన్న చిన్ని సంకల్పంతో ఒక చిన్ని ప్రయత్నాన్ని ఆరంబించబోతున్నాను..
ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి నేను సరిపోను కానీ నాకు తెలిసిన కాస్త ప్రేమ జ్ఞానాన్ని మీకు అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నం అంతే...
నా ఈ చిన్ని ప్రయత్నం వల్ల ఒక్క జంటలో మార్పు వచ్చిన సరే నా ఏ ప్రయత్నం సఫలం అయినట్టే.. అందరికి మహోన్నతమైన ప్రేమదొరకాలని ఆకాంక్షిస్తూ...........ప్రేమతో మీ..

జగన్‌ గెలిచినా కష్టాలు: జెసి దివాకర్ రెడ్డి


 కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలతో శనివారం అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో వారిని మీడియా చూసి జెసి కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు చేరిందా? లేక వైయస్సార్ కాంగ్రెసులో జెసి కాంగ్రెసు చేరిందా? అని ప్రశ్నించారు. అందుకు వైయస్సార్ కాంగ్రెసు నేతలు జెసి పేరులోనే జగన్ కాంగ్రెసు ఉందని చెప్పారు.
ఆ తర్వాత జెసి మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు 2014 తర్వాత సంవత్సరం పాటు సంతోషంగా ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే ఏడాది సంతోషంగా ఉన్నా ఆ తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
అంతకుముందు జెసి దివాకర్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కమిటీ ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తానని చెబితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి వస్తారని రాహుల్ టీం పరిశీలకులకు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు కంటే ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉందన్నారు. లోకసభ, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఒక్కరు కూడా పార్టీలో మిగులరని చెప్పారు. సిబిఐ కేసులు ఎత్తివేసి, ముఖ్యమంత్రిని చేస్తామంటే జగన్ వస్తాడన్నారు. అనంతపురం, హిందూపురం లోకసభ స్థానాలకు అభ్యర్థులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని చెప్పారు.

Wednesday, November 28, 2012

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమలోకి డైలాగ్ రైటర్ గా తన ప్రస్తానం ప్రారంభించిన త్రివిక్రమ్ తన పదునైన రచనా నైపుణ్యంతో అనతి కాలంలోనే పాపులర్ డైలాగ్ రైటర్‌గా ఎదిగారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు కేవలం 5 మాత్రమే. అయినా అతని సినిమాలంటే జనాల్లో మహా క్రేజ్ ఏర్పడిందంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు.red more

చెయ్యెత్తితే బస్పు ఆగదు..బొత్స నిర్వాకం !


వెనకటికి ఓ కథ ఉంది. ఆ కథలో కుక్క, గాడిద ఉంటాయి. ఓ రోజు కుక్క చేయాల్సిన పని అత్యుత్సాహంతో గాడిద చేస్తుంది. దాని పర్యావసానం గాడిద నడ్డి విరుగుతుంది. కాకాలు పట్టి, అడుగులకు మడుగులొత్తి రాజకీయాల్లో చేరి అమాత్యులైనవారు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో తాజాగా ఆర్టీసీ లో తీసుకుంటున్న నిర్ణయాలు తేల్చిచెబుతున్నాయి. మందు దందా చేసే వారు మంత్రులయితే ఎలా ఉంటుందో తాజాగా బొత్స నిర్ణయం అలాగే ఉంది.
రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ఇటీవలె ఛార్జీలు పెంచారు. అయినా ఆర్టీసి రూ.4200 కోట్లు అప్పులు ఉంది. నెలకు రూ.100 కోట్లు వడ్డీ చెల్లిస్తుంది. అయినా కార్మికుల జీతాల కోసం ప్రతి నెలా రుణాలు తేవాల్సి వస్తోందట. అందుకే ఈ నష్టాల భర్తీకి మరోసారి ప్రయాణీకుల మీద భారం మోపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రయాణికుడి నుండి అర్ధ రూపాయి నుండి రూపాయి దాకా సర్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికి ఆ శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ సంతకం కూడా చేసేశారు. ఇక ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి.  ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది అది ఏంటంటే ఆర్టీసీలో ఫ్లాట్ ఫాం టికెట్ ప్రవేశ పెడతారట. అంటే రైల్వేస్టేషన్లలో మాదిరిగా అన్నమాట. బస్టాండుకు వచ్చిన ప్రతి ప్రయాణికుడి ఈ డబ్బులు వసూలు చేసి ఆయా బస్ స్టేషన్ల నిర్వహణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారట.red more

పార్టీ - పార్టీ నడుమ కోదండరామ్


నారీ నారీ నడుమ మురారి అన్నట్లు రెండు తెలంగాణ పార్టీల మధ్య తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిల మధ్య విభేదాలు కోదండరామ్‌కు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. రెండు తెలంగాణ పార్టీల మధ్య వైరాన్ని నివారించేందుకు తెలంగాణ రాజకీయ జెఎసి నడుం బిగించింది.
మంగళవారం సమావేశమైన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఆవశ్యకతను గుర్తించింది. రెండు పార్టీల మధ్య విభేదాలు తెలంగాణవాదానికి నష్టం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ జెఎసి అభిప్రాయపడుతోంది. డిసెంబర్ 1వ తేదీన తలపెట్టిన విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశానికి జెఎసి రెండు పార్టీలను కూడా ఆహ్వానించింది.red more

Tuesday, November 27, 2012

మన రాష్ట్రంలో దేవుడు తలలు పగులగొట్టుకోమన్నాడా?

మొహరం సందర్భంగా షియా భక్తులు తలలు పగులకొట్టుకోవడం, గుండెలపై బాదుకోవడం...
కర్నూలుజిల్లా దేవరగట్టులో భక్తులు దేవుడ్ని దక్కించుకోవడానికి కర్రల సమరం. పగిలే తలలు..
గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ వేయించుకోవడం, ముళ్ళ కిరీటాలు ధరించడం...
కాళీమాతకు తన నాలుక కోసి అర్పించిన భక్తుడు...
దేవుడ్ని చూడాలనే తపనతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భక్తుడు....red more

Sunday, November 25, 2012

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోం:కిరణ్ కుమార్ రెడ్డి

 వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పిల్ల్రలకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. కాంగ్రెసు పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. జగన్ తన కంపెనీలో పెట్టుబడులపై చంచల్‌గూడ జైలుకు వెళ్లారన్నారు. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసి వెళ్లలేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పలు పథకాలతో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును వెనుకేసుకొచ్చారు. ఓ మంత్రిగా ఏం చేయాలో అప్పుడు ఆయన అదే చేశారన్నారు. ఈ సందర్భంగా కిరణ్ పలు పథకాలు ప్రకటించి, ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు.red more

Saturday, November 24, 2012

జగన్ పార్టీలోకి చూద్దాం:కావూరి సాంబశివ రావు


పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశానని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలిచి, మాట్లాడితే రాజీనామాపై పునరాలోచిస్తానని కాంగ్రెసు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. ప్రస్తుతానికి రాజీనామాకే కట్టుబడి ఉన్నాఆయన అన్నారు.
నూజివీడులో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యలో వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కిస్తూ, పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరించటం బాధాకరమన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా అని అడిగితే, 'ఈ విషయం పత్రికల్లోనే వస్తోంది. చూద్దాం. ఆలోచిద్దాం' అంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి మనస్ఫూర్తిగా ఇష్టంలేకున్నా, పార్టీ సీనియర్‌ల పట్ల చూపుతున్న వివక్ష, వారికి జరుగుతున్న అన్యాయం వల్ల విసిగి వేసారి రాజీనామా చేసినట్లు చెప్పారు.

Friday, November 23, 2012

‘డమరుకం’ను తెలంగాణాలో అడ్డుకుంటాం

ఢమరుకం చిత్రం పేరుకు సంబంధించిన సర్వహక్కులు తమవేనంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ జేఏసీ చైర్మన్ జైహింద్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ ఢమరుకం పేరును ముందు తమకు కేటాయించి అనంతరం ఢమరుకం చిత్ర నిర్మాత శ్రీధర్‌డ్డికి కేటాయించడం అన్యాయమన్నారు. తెలంగాణకు చెందిన నిర్మాతలు, దర్శకులు రూపొందిస్తున్న చిత్రాల ఫలితాలు సీమాంధ్ర దర్శక, నిర్మాతలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు కళ్యాణ్‌తోపాటు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము టైటిల్ 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు.తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు ‘డ' బదులు ‘ఢ' తగిలించి ‘డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని ఆవేదన వ్యక్తం చేసారు.

శాసనసభకే పోటీ చేస్తా…బాలకృష్ణ

2014 సాధారణ ఎన్నికల్లో పోటీ అంశంపై  హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారాన్ని బాలయ్య తోసిపుచ్చారు. పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. పార్టీలు మారేవారంతా అవకాశవాదులని, కొందరు స్వార్థం కోసమే వలసలు వెళ్తున్నారని ఆయన తెలిపారు. వలసల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వలసలు సాధారణమేనని ఆయన అన్నారు. స్వార్థంతోనే ఇతర పార్టీలకు కొంత మంది వలసలు పోతున్నారని ఆయన విమర్శించారు.red more

Tuesday, November 20, 2012

రాష్ట్రంలో సానుభూతి భయం

జగన్ జైల్లో ఉండడం ప్రత్యర్థులకు ఒక రకంగా లాభిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే గనుక… ‘జైల్లో ఉన్నాడనే సానుభూతితోనే ఓట్లు పడ్డాయని, సీబీఐ మీద, న్యాయవ్యవస్థ మీద తాము తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రభావం చూపించగలిగి ఉన్నా… ఆయనను బయటకు పంపి సానుభూతిని పలుచనచేసి ఉండేవార’మని కాంగ్రెస్ వారు ఆ తర్వాత అయిదేళ్లపాటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికేయవచ్చు. అలాగే… ‘కాంగ్రెస్ పార్టీ జగన్‌తో కుమ్మక్కు అయిందని, అందుకే ఆయనను జైల్లో ఉంచి ఆయనకు సానుభూతి పెరిగి ఓట్లు వెల్లువలా పడేలా దోహదం చేసిందని.. పరోక్షంగా కాంగ్రెస్ జగన్ విజయానికి కారణమైం’దని ఇలా రకరకాల ఆషాఢభూతి మాటలు వల్లెవేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి అయిదేళ్లపాటూ కాలం దొర్లించవచ్చు. ఇందుకు పనికొస్తుందే తప్ప… ఆయనను జైల్లో ఉంచడం అనేది… వైకాపా పట్ల ప్రజల్లో సానుభూతి పవనాలు రెట్టింపు కావడానికి కారణం అవుతోంది. వైకాపా ఆవిర్భావం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అవమానకరమైన వ్యత్యాసాలతో ఓడిపోయిన పార్టీలు …red more

Monday, November 19, 2012

రాష్ట్రంలో వణికిస్తున్న చలి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. శీతాకాలానికి వాయుగుండం తోడు కావడంతో చలి విజృంభిస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన వాయుగుండంతో చలి గాలులు అధికమయ్యాయి. ఏటా నవంబర్ మూడో వారం చలికాలం సీజన్ ప్రారంభమవుతుండగా, ఈ ఏడాది మొదటి వారం నుంచే చలి ప్రతాపం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో 14, 16, 18 డి గ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, గోదావరి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో RED MORE

Saturday, November 17, 2012

ఉద్యోగం వచ్చిన తరువాతే పెళ్లి...సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

స్వశక్తితోనే సాధికారిత సాధ్యం అని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగసాన్‌సూకీ అన్నారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లా పాపసానిపల్లిలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనీతీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూకీ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. తమ దేశంలో కూడా పథకాలు అమలు చేస్తామని సూకీ పేర్కొన్నారు.
ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాయిలకు సలహా ఇచ్చారు. మడకశిరలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సిఎం అయిన తరువాత లక్షా 20వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగాల భర్తీలో సిఫారసులకు తావులేదని, ప్రతిభకే పట్టం అన్నారు. తాను, రఘువీరా రెడ్డి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన త్వరగా మంత్రి అయ్యారని తెలిపారు. తనకు మంత్రి పదవి రాలేదని, ఇక ఎప్పటికీ మంత్రిని కాలేనని ఆయన అన్నారు. 

పాతబస్తీలో ప్రశాంతం వాతావరణం

నగరంలోని పాతబస్తీలో ప్రశాంతం వాతావరణం నెలకొంది. పోలీసులు రాకపోకలను అనుమతించారు. దుకాణాలు తెరుచుకున్నాయి. శాలిబండ, చార్మినార్ వద్ద బారికేడ్లను తొలగించారు. చార్మినార్‌కు సందర్శకుల రాక మొదలైంది. రాత్రి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కొనసాగుతోంది. పాతబస్తీ పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పాత బస్తీ ప్రశాంతంగా ఉన్నప్పటికీ రేపటి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ...దిగ్విజయ్ సింగ్‌

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి బాధ్యతలు దిగ్విజయ్ సింగ్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్విజయ్‌కు శనివారంనాడు పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పూలగుచ్ఛం ఇవ్వడాన్నిబట్టి ఢిల్లీ రాజకీయ పరిశీలకులలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ వ్యవహారాన్ని త్వరగా తేల్చండి అని కాంగ్రెస్ నాయకులు పాల్వాయి, గండ్ర, చెంగారెడ్డి శనివారంనాడు దిగ్విజయ్‌ను కోరారు. కాబోయే ఇన్‌ఛార్జి దిగ్విజయ్ అని తెలిసిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పెక్కుమంది నాయకులు దిగ్విజయ్ ఇంటికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తనను కలుస్తున్నవారినుంచి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.

Thursday, November 15, 2012

చంద్రబాబే ప్రభుత్వానికి అండ...షర్మిల

మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. ప్రజల మనసుల్లో కొలువైవున్న ఆయనను దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసినా ప్రతిపక్ష టీడీపీ మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు.‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పెద్దకడబూరు చేరుకున్న షర్మిల అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. బాబు తన హయాంలో గ్రామాలను స్మశానాలుగా మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ఇంకొక అవకాశం ఇమ్మంటున్నారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించొచ్చని సూచించారు. అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబేనని షర్మిల ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఒక్క సాక్ష్యం లేకపోయినా విచారణ పేరుతో జగనన్నకు బెయిల్ రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలో బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Wednesday, November 14, 2012

సీమాంధ్ర పార్టీలను తరిమికొట్టాలి... టీఆర్ఎస్

తెలంగాణ జిల్లాల్లో సీమాంధ్ర పార్టీ లను తరిమి కొ ట్టాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ శాసం రామకృష్ణ అన్నారు. మండల పరిధి దేవరఫస్లాబాద్ పంచాయతీ లొట్టికుంటతండాలో సోమవారం పార్టీ జెం డాను ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించకుండా దొంగతనంగా సీమాంధ్ర ప్రాంతాలకు తరలించుకుపోతున్నా పాలకులు అడ్డు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఆస్తులను సీమాం«ద్రులు ఇష్టనుసారం తమ ప్రాంతాలకు తరలించుకుని పోతున్నా ఏమీ పట్టనట్లు పాలకులు వ్యవహరిస్తుండడం చూస్తుంటే తెలంగాణ ప్రాంతాల పట్ల వారికి గల వివక్ష అర్థమవుతోందని అన్నారు. తెలంగాణ సాధన కోసం దాదాపు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్లుగా కూడా లేద న్నారు.

Tuesday, November 13, 2012

రాష్ట్రంలో రెచ్చిపోతున్న హిజ్రాలు

                                           
రాష్ట్రంలో పలు చోట్ల హిజ్రాలు రెచ్చిపోతున్నారు. కేవలం యాచకులుగా భావించి ప్రజలు, పోలీసులు వారిని అలా వదిలివేయడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లింగపరమైన సమస్య తప్ప వారికి ఏ లోపం ఉండదు. కొందరు లింగమార్పిడి చేసుకున్నవారు కూడా ఉంటారు. ఇటీవల కాలంలో లింగమార్పిడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వారు అన్ని రకాల పనులు చేయగలరు. చేస్తారు కూడా. ఏ పని చేయడానికైనా వారి శరీరం అనువుగానే ఉంటుంది. కానీ వారిలో ఎక్కువ మంది పనిపాట లేకుండా చప్పట్లు కొడుతూ యాచనకు అలవాటుపడిపోయారు. ఏ పని చేయకుండా కాలం గడిచిపోతుండటంతో వారు అరాచకాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, దోపిడీలకు కూడా తెగబడుతున్నారు. లింగ మార్పిడి చేసుకున్న కొందరు వ్యభిచారానికి అలవాటు పడితే, మరికొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు ప్రాంతాలలో వారు తమ వికృత చేష్టలతో యువతీయువకులను, బాలురను వేధిస్తున్నారు. ముఖ్యంగా వారు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, బైపాస్ రోడ్లలో ఎక్కవగా ఉంటారు. రైళ్లలో వారి ఆగడాలకు హద్దులు లేవు. రైల్వే పోలీసులు చూసిచూడనట్లు వదిలివేయడంతో వారు రెచ్చిపోతున్నారు. రైళ్లలో చప్పట్లు చరుస్తూ వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడతారు. వారు అడిగినంత ఇవ్వాలి. ఇవ్వకపోతే హింసే. కుర్రవాళ్లని నానారకాలుగా ఇబ్బందిపెడతారు. వారిమీదకు ఎగబడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని దోచేస్తారు. వారికి ఎదురు తిరిగి నిలబడటం కష్టం. మహిళలను కూడా వేధిస్తారు. వికృత చేష్టలతో హింసిస్తారు. కొన్ని సందర్భాలలో వారి చేష్టల వల్ల ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. బైపాస్ రోడ్లలో రాత్రి అవ్వగానే మొదలుపెట్టి, తెల్లవారుజాము వరకు అక్రమవసూళ్లు కొనసాగిస్తారు. వాహనదారులను వేధిస్తారు. డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారు. 

హైదరాబాద్‌లో 12.12.12న 'చూమంతర్'

వచ్చే నెల 12వ తేదీన 12.12 గంటలకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సదస్సు 'చూ మంతర్'కు బ్రోచర్‌ను సోమవారం నాడిక్కడ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ, మెజీషియన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, సదస్సు కన్వీనర్ సామల వేణు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

Sunday, November 11, 2012

హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్!

హైదరాబాద్ పాతబస్తీ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. చార్మినార్ ప్రాంగణంలోనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా ఇటు మతపరమైన, అటు రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. పాతబస్తీలోని చార్మినార్ కు ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయ మరమ్మతులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. దీపావళి పండుగ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయ షెడ్‌ను ఈ నెల 1న తొలగించి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. అది చూసిన మరో వర్గం ప్రజలు ఆలయాన్ని విస్తరిస్తున్నారని అపార్ధం చేసుకున్నారు. పనులకు అడ్డుతగిలారు. ఆ తరువాత ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ ఆందోళనకు దిగటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ తరువాత దేవాలయ నిర్వాహకురాలి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వక్తం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు లోబడి ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పాతబస్తీ భగ్గుమంది. 

చిక్కుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా, మూలుగుతూ ముక్కుతూ నడుస్తున్న కిరణ్ ప్రభుత్వంపై పాతబస్తీ గ్యాంగ్ లీడర్ ఒవైసీ విరుచుకుపడ్డాడు. తమ పార్టీ నాయకుల విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడుతున్నాడు. సరాసరి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని తన అస్త్రాన్ని సంధించాడు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. చార్మినార్ ను అనుకుని ఉన్న భాగ్య లక్ష్మీ ఆలయం విషయంలో మజ్లిస్ పార్టీ నాయకులు అతి చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మజ్లిస్ పార్టీ మండిపడుతోంది. తమ మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ఏమిటని వారు వాదిస్తన్నారు. వివాదాన్ని ఎవరు రాజేశారు అనేది పాయింటుకాదు కానీ, ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి మీద పడుతుండటం విషయం. ఒవైసీలకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. ఢిల్లీ జుమా మసీద్ ఇమామ్ స్థాయిలో ఒవైసీలను ట్రీట్ చేస్తూ వస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మరి ఒవైసీ మద్దతు ఉపసంహరించుకుంటాను అంటే వారు ఉలిక్కిపడతారు. ముస్లింలంతా తమకు దూరం అయిపోయారని బాధపడతారు. దీంతో ఇప్పుడు కేంద్రం నుంచి కిరణ్ కు మొటిక్కాయలు తప్పకపోవచ్చు. సన్నిహితులను దూరం చేస్తున్నావని కిరణ్ పై కేంద్రం మండిపడ వచ్చు.మొత్తానికి పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని  అసదుద్దీన్ ఒవైసీ అంటున్నాడు. సోమవార ఉదయం 11 గంటలకు ఎంఐఎం కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నామని ఆయన అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చే అంశంపై  మధ్యాహ్నానికి ఒక  ప్రకటన చేస్తామని ఆయన వివరించాడు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో ఇకపై! మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ వేడి రుచి చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. డిసెంబర్ 9లోపు తేల్చాలని డెడ్ లైన్ కూడా విధించారు. లేకుంటే వారు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది నిజమేనన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు బానిసలవుతారని తాను అనుకోవడంలేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. చివరిసారిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు నిర్ణయించుకున్నారు. ఆ లేఖలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, అందులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, తమ బాధని, ఆవేదనని వివరించాలని అనుకుంటున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఇదే సమయం అని వారు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ తప్ప తమకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరంలేదని వారు తెగేసి చెబుతున్నారు. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడతారా? లేదా? అనేది తమ నేత సోనియాకు రాసే లేఖలో పేర్కొననున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామనడం రాజకీయంగా గొప్ప త్యాగంగా ఆయన వర్ణించారు. 

ఓరుగల్లు రామప్ప చరిత్ర


ఓరుగల్లు రామప్పదేవాలయ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవుని పాత్రను సుమన్ పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు చక్రి ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు.
కుమార్ మారబోయిన నిర్మాత. రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది.
రామప్ప పాత్ర పోషిస్తున్న కాశీనాథ్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు.

Wednesday, November 7, 2012

ఇక నుంచి తెలుగు అక్షరాలే కన్పించాలి


రాష్ట్రంలో ఇక ఎక్కడైనా తెలుగు అక్షరాలే కనిపించాలని అలా కన్పించకపోతే జరిమానా తప్పదని అధికార తెలుగు భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ హెచ్చరించారు. రాజధానిలో ఉన్న లక్షలాది వ్యాపార దుకాణాలపై నామకరణాలు ఇంగ్లీష్‌లో ఉండడం క్షమార్హం కాదని ఆయన అన్నారు. తెలుగు మహాసభలు జరిగే సమయానికి రాష్ట్రంలో ప్రతి చోటా తెలుగు అక్షరాలు కన్పించాలని ఆశిస్తున్నామని అన్నారు. తిరుపతిలో జరగనున్న తెలుగు మహాసభలపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార దుకాణాల నామఫలకాలు తెలుగులో స్పష్టంగా కన్పించే విధంగా ఉండాలని బుద్ధ ప్రసాద్ సూచించారు. 1966లో తెలుగు భాషను చట్టంగా రూపొందిచుకున్నామని అందుచేత తెలుగును భావనా భాషగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రథమ భాషగా తెలుగు, ద్వితీయ భాషగా ఉర్దూ, తృతీయ భాషగా ఇంగ్లీషును వాడాలని ఆయన సూచించారు. శాస్త్ర సాంకేతిక అంశాలను అందిపుచ్చుకున్న నేటి తరంలో తెలుగుకు ఉపకరణాలు తీసుకురావడం జరిగిందన్నారు. వీటికి కీ బోర్డు కూడా తీసుకురావడం జరుగుతుందని ఆయన చెప్పారు. తెలుగులో పదాలు కంపోజింగ్ చేసే సమయంలో తప్పులు దొర్లినప్పుడు వెంటనే సరైన పదాలు వచ్చే విధంగా నిఘంటువును తయారు చేశామన్నారు. త్వరలో అన్ని శాఖలకు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో తెలుగుభాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే కడప యోగివేమన యూనివర్సిటీ స్నాతకోత్సవాల్లో ఉపకులపతి రామచంద్రారెడ్డి తెలుగులో ప్రసంగం చేయడం తొలి విజయంగా ఆయన చెప్పారు. తెలుగు మహాసభలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగు మహాసభల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ఆయ అన్నారు. తెలుగుభాషకు ఔన్నత్యాన్ని చేకూర్చేందుకు అధికార తెలుగు భాషా సంఘం తొలి సమావేశం సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేశామన్నారు.

కేసులు పెట్టాల్సింది పోలీసులపైనే


విద్యుత్ ఉద్యమంలో భాగంగా జరిగిన బషీర్‌బాగ్ కాల్పుల ఘటనలో కేసులు పెట్టాల్సింది తమపై కాదని, ఆ రోజు ముగ్గురు మరణానికి బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపించాలని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన సిపిఐ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర చేసినట్టు చెబుతున్నారని అలాంటి అవసరం ఆనాడు కమ్యూనిస్టులకు లేదని, దానికి కుట్ర చేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. 9 వామపక్షాలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా నిరాహారదీక్షలు చేశారని, ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చినపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఇపుడు ఉద్యమకారులే తుపాకీ లాక్కుని కాల్పులు జరిపారనే రీతిలో పోలీసులు చెప్పడం దారుణమని అన్నారు. నిజానికి అసెంబ్లీ వరకూ జరిగిన ర్యాలీలో సిపిఎం నేతలు ఇతరులు కూడా తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
ఆనాడు హోం మంత్రిగా జానారెడ్డి ఉన్నపుడు కేసులు అన్నింటినీ ఉపసంహరించినట్టు చెప్పారని, పోలీసు కాల్పుల్లో మరణించిన ముగ్గురి స్మారక చిహ్నాన్ని నిర్మిస్తే దానిని ముఖ్యమంత్రే స్వయంగా ఆవిష్కరించిన విషయాన్ని సుధాకర్‌రెడ్డి గుర్తుచేశారు.

Sunday, November 4, 2012

పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలిపివేత


భారీ వర్షాల ప్రభావం రైలుమార్గాలపై తీవ్రంగా పడింది. పలు రైళ్ల రాకపోకలు తీవ్రంగా ఆలస్యమయ్యాయి. విజయవాడ సమీపంలోని కొండపల్ల్లి- మధిర మధ్య రైల్వేట్రాక్‌పై నీరు నిలవడంతో పలు ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యం కాగా, ప్యాసింజర్ రైళ్లను శనివారం రద్దు చేశారు. గూడూరు-విజయవాడ, కాజీపేట- సికింద్రాబాద్ మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 12296 పాట్నా - బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, కర్నూలు, డోన్, గుత్తి, ద్రోణాచలం మీదుగా దారి మళ్లించారు.
తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్, చెన్నై-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, గూడూరు-సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్‌లను తెనాలి- గుంటూరు- నడికుడి- బీబీనగర్ మార్గంలో మళ్లించారు. 57237 కాజీపేట- విజయవాడ , 57238 విజయవాడ-కాజీపేట, 57254 విజయవాడ - భద్రాచలం, 57253 భద్రాచలం- విజయవాడ, 67269 కాజీపేట- దోర్నకల్, 67271 డోర్నకల్- విజయవాడ, 67273 విజయవాడ- గుంటూరు, 67274 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.

ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా రాజీనామా

'పదహారేళ్లపా టు ఎన్టీఆర్ పెట్టి న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్నా.. ఎన్నో అవమానాలు భరించా.. ఆర్థ్ధిక ఇబ్బందులకు గురయ్యా.. నేను పోరాటం చేసేందుకు తగిన వేదిక కూడా దొరకలేదు.. ఎటూ పాలుపోలేక కొన్నిసార్లు నిస్తేజంగా ఉండిపోయాను.. వీటన్నింటితో వేగలేకే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తు న్నా..' అని లక్ష్మీపార్వతి ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె శనివా రం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలిపారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను సమర్పిస్తున్నానని, లేఖ ప్రతిని పార్టీ ప్ర ధాన కార్యదర్శికి పంపానని, అలాగే న్యాయవాది సలహా తీసుకుని ర్రాష్ట ఎన్నికల సంఘానికి కూడా పంపనున్న ట్లు ఆమె వెల్లడించారు. 1996లో ఎన్టీఆర్‌కు అన్యాయంచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడున్న టీడీ పీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని, చంద్రబాబు టీడీపీ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌పై నేరుగా పోరాటానికే వైసీపీని స్థాపించారని, తన ఉద్దేశం కూడా అదేనని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించానన్నారు. ఆ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానన్నా రు. ఎన్టీఆర్ పార్టీకి రాజీనామా చేయడం ద్వా రా మీరు కూడా ఎన్టీఆర్‌కు నమ్మకద్రో హం చేసినట్టు కాదా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానాన్ని దాటవేశారు.

Friday, November 2, 2012

ఎర్రన్నాయుడి మృతి పట్ల జూ ఎన్టీఆర్ సంతాపం

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడి మృతి పట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్ ఎంపీలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, సిఎం రమేష్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎర్రన్నాయుడు మృతి పార్టీకే కాక దేశానికి, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, రోషన్‌బేగ్, బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అభిషేక్, తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు, కార్యవర్గ సభ్యుడు కే గంగరాజు, కర్ణాటక తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసయ్య, కర్ణాటక తెలుగు సమాఖ్య కార్యదర్శి బెల్లం రమణ చౌదరి తదితరులు ఎర్రన్నాయుడుకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే...

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే... మీరు (ప్రజలు) కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. సాగు కోసం వేలాది రూపాయలు అప్పు చేసినా పంట చేతికి రావడం లేదు. నిత్యావసర ధరలు పెరిగి మధ తరగతి ప్రజలు నిరుపేదలవుతున్నారు. పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 'వస్తున్నా మీ కోసం పాదయాత్ర' బుధవారం జిల్లాలోని చిన్నచింతకుంట మండలం మద్దూర్, ఏదులాపూర్, వడ్డెమాన్‌లలో కొనసాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళా కూలీలు, రైతులు, వడ్రంగులను కలుసుకొని, వారి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు రావడం లేదని కొందరు.. ఇంటి బిల్లులు ఇవ్వడం లేదని మరికొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆవేదనపై స్పందించిన చంద్రబాబు, జిల్లా పేదరికాన్ని చూసే తాను సీఎంగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నట్లు ప్రకటించానని, ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.

Thursday, November 1, 2012

ఆలయాలలో చోరీలన్నీ మాఫియా పనేనా..!

హైదరాబాద్ సిటీ బంగారం ధర చుక్కలనంటుతుండటంతో దొంగల దృష్టి ఆలయాలపై పడిందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే.. ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. దొంగసొత్తును మార్కెట్లో విక్రయిస్తే అందులో సగం మాత్రమే వస్తోందన్న సంగతి తెలిసిందే. ఆలయాల్లో దొంగిలించిన సొత్తుకు మాత్రం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క పురాతన వస్తువు చేతిలో పడినా దొంగల పంట పండినట్టే. ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అమ్మవారి ఆభరణాలు, పురాతన పంచలోహ విగ్రహాల చోరీ వెనుక పెద్ద కథే దాగి ఉంది. ఈ మాఫియా చీకటి వ్యాపారంపై ప్రత్యేక కథనం.. పురాతన వస్తువులెన్నో..నగరంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. వీటిలో అమ్మవారి ఆలయాలే అధికంగా ఉన్నాయి. బంగారం, వజ్రకిరీటాలు, ఆభరణాలు, ముక్కుపుడకలు, గాజులు అమ్మవారి విగ్రహాలకు అలంకరిస్తున్నారు. కొందరు భక్తులు వేలు, లక్షల రూపాయలు ఖర్చు బెట్టి ఆభరణాలను తయారు చేయించి కానుకలుగా సమర్పిస్తున్నారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయంతో కమిటీ సభ్యులు కూడా అమ్మవారికి బంగారు వస్తువులు చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, క్రీస్తు పూర్వం, నిజాం నవాబుల కాలంలో వెలసిన గుళ్లలో ఎన్నో రకాల పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. పూజలకు వినియోగించే పంచలోహ పాత్రలూ ఉన్నాయి. వీటిలో అమ్మవారు, గణేశ్, రామలక్ష్మణులు, నటరాజు వంటి విగ్రహాలతో పాటు అరుదుగా కనిపించే శంఖాలు కూడా ఉంటున్నాయి. విలువ లక్షలు, కోట్లేనటఅమ్మవార్లు ధరించిన ఆభరణాలు, పురాతన విగ్రహాలతో సహా ఆలయాల్లోని ఇతర ఏ వస్తువుకైనా అతీతశక్తులు ఉంటాయని భక్తులు భావిస్తుంటారు. కానుకలుగా సమర్పించిన కొత్త వస్తువులైనా.. కొద్దిరోజులు పూజలందుకుంటే చాలు వాటికీ మహిమలు ఉంటాయని నమ్ముతుంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వీటికి గిరాకీ బాగా ఉంటోంది. శక్తులు ఉన్నాయన్న నమ్మకంతో వాటి విలువ లక్షలు, కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పురాతన విగ్రహాలంటూ విక్రయిస్తున్న 12 ముఠాలను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టార్గెట్ అందుకేనా.. నగరం, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలోని పురాతన ఆలయాలపై దొంగల ముఠాలు విరుచుకుపడుతున్నాయి. రెక్కీ నిర్వహించి మరీ ఆలయాలలోని సొత్తును కొల్లగొడుతున్నాయి. జంట కమిషనరేట్లలోని చిన్నా,చితకా అన్నీ కలిపి ఈ ఏడాది అక్టోబర్ వరకు 27 ఆలయాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెలలో జరిగిన దొంగతనాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది లాల్‌దర్వాజలోని మహంకాళి ఆలయమే. గోల్నాకలోని నల్లపోచమ్మ, ఉప్పుగూడలోని రెండు ఆలయాలలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. కార్వాన్‌లోని ఓ ఆలయంలో పురాతన విగ్రహాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా తెలివిగా నేరాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలు ఈ సొత్తునంతా గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్నో మాఫియా ముఠాలుదేశంలో ఎన్నో మాఫియా ముఠాలు చీకటి వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో కరుడుగట్టిన నేరస్తులు, దొంగలతో పాటు కొందరు వ్యాపారులు కూడా ఉంటున్నారని సమాచారం. ఇతర రాష్ట్రాలతో పాటు నగరంలో కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఉన్న చాలామంది ఇదే పనిలో నిమగ్నమై ఉంటున్నారు. ఇలాంటి వారు నలురైదుగురు కలిస్తే చాలు.. ప్రధానంగా ఇదే విషయంపై చర్చించుకుంటూ ఉంటారు. అమ్మవారి అభరణాలు, పురాతన విగ్రహాలే కాకుండా నాణేలు, రెండు తలల పాములను కూడా విక్రయిస్తున్నారు. అంతెందుకు ఇటీవలికాలంలో అయిదు రూపాయల నోటుకు 50 రూపాయలు ఇచ్చి ఈ మాఫియా హల్‌చల్ చేసింది. సాధారణంగా పొలాలలో దొరికే రెండు తలల పాము, నక్షత్ర తాబేళ్లు, రంగురాళ్ల ధరను లక్షలు, కోట్లు పలికేలా చేశారు. మార్కెట్లో అమ్మవారి ఆభరణాలకు ఉన్న డిమాండ్‌తో లబ్దిపొందేందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం పోలీసులకు తెలిసినా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దర్యాప్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మళ్లీ నరేంద్ర మోడిదే హవా!: పెరిగిన ముస్లింల మద్దతు !

వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలలు గుజరాత్ ఎన్నికలలో మళ్లీ భారతీయ జనతా పార్టీయే ఘన విజయం సాధించనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలకు మరెంతో దూరం లేనందున సర్వే సంస్థలు గుజరాత్ ప్రజలు ఎవరి ఓటు వేస్తారో తెలుసుకునేందుకు పలు దఫాలుగా సర్వేలు చేస్తున్నాయి. ప్రారంభంలో బొటాబొటి మెజార్టీతో బిజెపియే మళ్లీ గుజరాత్‌ను దక్కించుకుంటుందని చెప్పిన సర్వేలు తాజాగా అద్భుత విజయం సాధిస్తాయని చెబుతున్నాయి. కేవలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనే పదం ఒక్కటే బిజెపి ఘన విజయానికి తోడ్పడుతుందని చెబుతున్నాయి. బిజెపిని పార్టీగా కంటే మోడిని వ్యక్తిగా గుజరాత్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కువగా ఆదరిస్తున్నారట. మోడికే ఓటు వేసేందుకు మెజార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారట. ఆయన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన తీరు, అభివృద్ధి, ఉద్యోగాలు తదితరాల కారణంగా ఆయనకే మళ్లీ పట్టం కడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో ప్రజలు ఉన్నారట. 2007 కంటే ఇప్పుడు బిజెపికి ఓటింగ్ శాతం రెండు వరకు పెరగవచ్చునని, ఈ ఓటింగ్ శాతమే బిజెపి గతంలో కంటే ఎక్కువ స్థానాలలో గెలుపొందేందుకు అవకాశముందని చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు మద్దతు కూడా మోడీకి క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. 2007లో 14 శాతం మంది ముస్లింలు మోడీకి మద్దతు పలకగా ఇప్పుడు అది 23 శాతానికి పెరిగింది. అయితే మోడీకి కేశూభాయ్ పటేల్ షాకిచ్చే అంశాన్ని కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇలా ఉన్నప్పటికి కేశూభాయ్ కారణంగా బిజెపి ఓట్లు కొద్దిగా చీలి నష్టపరుస్తుందని చెబుతున్నారు. మరో విషయమేమంటే గుజరాత్ ఎన్నికలే 2014లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారా లేదా అని తేల్చనున్నాయి.

'దేనికైనారెడీ' సినిమాపై బ్రాహ్మణుల ఆందోళన

'దేనికైనారెడీ' సినిమాపై జరుగుతున్న వివాదం చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతోంది. సినిమాల్లో తమ వర్గాన్ని హేళనచేసే దృశ్యాల గురించి ఇంతవరకూ పట్టించుకోని బ్రాహ్మణులు ఇకపై వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తమ వర్గం వారిని సమీకరించుకుంటున్నట్టు కనబడుతోంది. ఇందులో భాగంగా మొదటి టార్గెట్ ఇది. గతంలో 'అదుర్స్' సిన్మాలో బ్రాహ్మణుల్ని కించపరిచినంతగా ఇందులో 5 శాతం కూడా లేదని కొందరు మిత్రులు చెప్పారు. వాస్తవానికి సినిమాల్లో బ్రాహ్మణుల్ని హేళనచేయడం సాధారణమై పోయింది. ఒక కమ్యూనిటీని ఎగతాళి చేయకుండా సిన్మాలు తీయడం మనోళ్ళకి చేతకాదా అని నా అనుమానం.  నా చిన్నపుడు అనేకసార్లు చూసిన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర చేసే కామెడీ చాలా నచ్చేది. కానీ ఇప్పుడు గనక చూస్తే వైశ్య కమ్యూనిటీని కించపరిచేవిధంగా వుందనిపిస్తుంది. సినిమాను సినిమాగానే చూడాలని కొందరంటున్నారు... కానీ సినిమా కూడా ఒక మీడియానే...అది కూడా ప్రజలముందే ప్రదర్శితమవుతోంది కదా? బ్రాహ్మణ సంఘాలు నిరసనలకు దిగడం మంచి పరిణామమే.ఇలా వర్గాలుగా విడిపోకుండా అందరూ సంఘటితమై పోరాడితేనే ఏదైనా సాధించగలరు. ఏదిఏమైనా ఒక కమ్యూనిటీని కించపరిచేవిధంగా ఎవరు ప్రవర్తించినా కులమతాల కతీతంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని నా కోరిక... If I am not wrong.

Wednesday, October 31, 2012

తమిళనాడును వణికిస్తున్న నీలం తుపాను

నీలం తుపాను తమిళనాడును వణికిస్తోంది. నీలం మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. చెన్నైకి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు, కడలూరు మధ్య చెన్నైసమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటింది, తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు రెండు మీటర్లకు పైగా ఎగిసిపడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావిత తీరం వెంబడివున్న లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్‌ చేసింది. కాగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మహాబలిపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ విపత్తు నివారణ సంస్థ, సైన్యం సిద్దంగా ఉంది. 

Tuesday, October 30, 2012

500 కిలోమీటర్ల దాటిన చంద్రబాబు పాదయాత్ర

వస్తున్నా... మీకోసం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 28వ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరులో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలేదని, రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తుదని ఆయన విమర్శించారు. ఇది పనికిమాలని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో కరువు వచ్చినా రైతులకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన చెప్పారు. రైతుల కష్టాలు చూస్తేంటే గుండె తరుక్కుపోతుందని, ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి ప్రకటించారు. చంద్రబాబు పాదయాత్ర మంగళవారం 500 కిలోమీటర్ల మైలురాయి దాటింది.

తుపాన్‌గా మారిన వాయుగుండం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపాన్‌గా మారింది. దీనిని 'నీలం'గా చెన్నై వాతావరణ కేంద్రం ఖారారు చేసింది. తుపాన్ చెన్నైయ్‌కు ఆగ్నేయంగా500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సముద్రంలో అలల ఉధృతి పెరింగింది. గంటకు సుమారు 45 నుంచి 60 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో తమిళనాడులో, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు - నాగపట్నం మధ్య బుధవారం రాత్రి లోగా తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్‌ నవంబరు 2 నాటికి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైబడి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే 48 గంటలు సముద్రం కల్లోలంగా ఉంటుందని, మరోవైపు చెన్నై పోర్టులో అధికారులు ఏడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగపట్నం, తూతుకూడి, కారేకల్ పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీగా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత తీరం దిశగా వచ్చేసరికి గాలుల తీవ్రత పెరుగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తీరప్రాంత జిల్లాల్లో అలజడి మొదలైంది. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడ రేవుల్లో ఇప్పటికే మూడో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేయగా, తమిళనాడులోని పలు తీర ప్రాంతాల్లో నాలుగోనెంబరు హెచ్చరిక ఎగరేశారు. తుఫానుగా మారే వాయుగుండం నెల్లూరు- నాగపట్నం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరిగింది. అల్లూరు మండలం ఇస్కపాళెం వద్ద తుఫానుషెల్టర్ కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు వీస్తున్నాయి.

నవంబర్ 1ని బహిష్కరించండి

నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి, విద్రోహదినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకటో తేదీన తెలంగాణ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులను సూచించారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో నిరసన తెలపాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.

Saturday, October 27, 2012

చంద్రబాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్

 గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

మహిళలతో షర్మిల రచ్చబండ

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పదవరోజు జిల్లాలోని గొల్లపల్లిలో షర్మిల శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బడంగపల్లి చేరుకున్న షర్మిల అక్కడి వేరుశనగ పంటలు పరిశీలించి రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుడంగపల్లెలోని మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ సీఎం భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుంటే తప్ప ప్రజలు బాధలు తెలుసుకోలేరని విమర్శించారు. అక్కడ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Saturday, October 13, 2012

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల సమ్మె

 విద్యుత్ కోతలతో పెట్రోలు బంకుల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ రాజీవ్ అమరం పేర్కొన్నారు. చమురు కంపెనీలు కమీషన్ పెంచేందుకు ముందుకు రాకపోవడంతో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు శనివారం విలేకరులకు తెలిపారు. సమ్మె రోజుల్లో ఒక్క షిఫ్ట్‌లో మాత్రమే పెట్రోలు బంకుల్లో విక్రయాలుంటాయని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అవుట్‌లెట్‌లు పనిచేస్తాయని తెలిపారు. హైవేలోని అవుట్‌లెట్లలో రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకే అమ్మకాలు ఉంటాయన్నారు.

రాయలసీమ ప్రజలారా మేల్కొనండి...బైరెడ్డి


పార్టీలకతీతంగా ప్రజలు, నాయకులు కలిసి రాయలసీమ హ క్కుల కోసం పోరాటం చేసి ప్రత్యేక సీమ సాధిద్దామని ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలుజిల్లా నుంచి కడప జిల్లాలో బైరెడ్డి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామ సరిహద్దులో మహిళా కూలీలు బైరెడ్డిని కలిసి జై రాయలసీమ అంటూ నినాదాలు చేస్తూ పూలమాల వేసి స్వాగతించారు. గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ అని, ఐక్యత ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. రాయలసీమ ఎన్నో సహజ వనరులకు నిలయమైన ప్రాంతం అన్నారు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే శ్రీబాగ్ ఒడంబడిక నీరుగారిపోయిందన్నారు. కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టులను పోగొట్టుకున్నామన్నారు. పాదయాత్ర అనంతరం నవంబరు 10వ తేదీ అనంతపురంలో జరిగే బహిరంగసభలో రాయలసీమ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఆనందంగా ఉంది...మహేశ్‌బాబు

ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉందని హీరో మహేశ్‌బాబు పేర్కొన్నారు. 14 రీల్స్‌ టీమ్‌ మొత్తానికి, దర్శకుడు శ్రీను వైట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2011 సంవత్సరానికిగానూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నంది అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మహేశ్‌బాబు ఎంపికయ్యారు. దూకుడు చిత్రానికిగానూ ఆయనకీ అవార్డు దక్కింది. 14 రీల్స్‌ పతాకంపై నిర్మించిన దూకుడు సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కించారు.

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం


2011 సంవత్సరానికి గాను తెలుగు సినిమా నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమ చిత్రంగా విరోధి ఎంపిక అయ్యాయి. ఉత్తమ నటుడుగా మహేష్‌బాబు, ఉత్తమ నటిగా నయన తార, ఉత్తమ దర్శకుడుగా శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు.

ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న
ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్‌సెంట్ లవ్
ఉత్తమ సమగ్రత చిత్రం : జై భోలో తెలంగాణ
ఉత్తమ పాపులర్ చిత్రం : దూకుడు
ఉత్తమ తొలి బాలల చిత్రం : శిఖరం
ఉత్తమ ద్వితీయ బాలల చిత్రం : గంటల బడి
ఉత్తమ తొలిడాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం
ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రం : మన బాధ్యత
ఉత్తమ నటుడు : మహేష్‌బాబు (దూకుడు)
ఉత్తమ నటి : నయనతార (శ్రీరామరాజ్యం)
ఉత్తమ దర్శకుడు : శంకర్ (జైబోలో తెలంగాణ)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాశ్ రాజ్(దూకుడు)
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి (ఇంకెన్నాళ్లు)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ (రాజన్న)
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్.ఎస్ నారాయణ (దూకుడు)
ఉత్తమ హాస్య నటి : రత్నసాగర్ (కారాలు-మిర్యాలు)
ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ బాల నటుడు : మాస్టర్ నిఖిల్ (100 పర్సెంట్ లవ్)
ఉత్తమ బాల నటి : బేబీ ఆన్వీ (రాజన్న)
ఉత్తమ స్కీన్‌ప్లే రచయిత : శ్రీనూవైట్ల (దూకుడు)
ఉత్తమ డైలాగ్ రైటర్ : నీలకంఠ (విరోధి)
ఉత్తమ లిరిక్ రైటర్ : మథుపల్లి సురేంధర్ ( రాతి బొమ్మలోన కొలువైన శివుడు - పోరు తెలంగాణ)
ఉత్తమ సినిమాటోగ్రఫి : పీఆర్‌కే రాజు (శ్రీరామరాజ్యం)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజ (శ్రీరామరాజ్యం)
ఉత్తమ ప్లేబాక్ గాయకుడు : గద్దర్ (పొడుస్తున్న పొద్దుమీద - జై బోలో తెలంగాణ)
ఉత్తమ ప్లేబాక్ గాయని : మాళవిక ( అమ్మా అవని - రాజన్న)
ఉత్తమ ఎడిటర్ : ఎంఆర్ వర్మ ( దూకుడు )
ఉత్తమ ఆర్ట్ డిజైనర్ : రవీందర్
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శ్రీను (జగదానందతారక - శ్రీరామరాజ్యం)
ఉత్తమ ఆడియో గ్రాఫర్ - దేవి కృష్ (బద్రీనాథ్)
ఉత్తమ కాస్టూమ్ డైరెక్టర్ - నిఖిల్ దాన్, భాషా (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - రాంబాబు ( శ్రీరామరాజ్యం)
ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - ఆర్‌సీఎమ్ రాజు ( పోరు తెలంగాణ)
ఉత్తమ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - సునీత ( శ్రీరామరాజ్యం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ మేల్ - నాగార్జున (రాజన్న)
స్పెషల్ జ్యూరీ అవార్ట్ ఫీమేల్ -చార్మి ( మంధర)
స్పెషల్ జూరీ అవార్ట్ - రమేష్ (ఋషి)

Friday, October 12, 2012

ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికకావడం ఎంతో సంతోషంగా ఉంది...అనిల్ కుంబ్లే

 ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికకావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సరికొత్త సవాల్‌ను తాను సమర్థవంతంగా నిభాయించగలనన్న నమ్మకం ఉందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన క్లైవ్ లాయిడ్ బాటలోనే ముందుకు సాగుతానన్నారు. క్రికెట్‌లో మరింతగా పాదర్శకతను సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు సంత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్న కుంబ్లే ఐసీసీ ఈ ఏడాది నిర్వహించే రెండో సభకు వచ్చే నెల హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుంబ్లేను ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌తో పాటు పలువురు అభినందించారు.

ఏపీ విభజన సాధ్యం కాదు...గులాం నబీ ఆజాద్‌

 తెలంగాణ అంశాన్ని తేల్చడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌, బీహార్‌, యూపీలను విభజించినట్లుగా ఏపీ విభజన సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ అంశంపై రెండేళ్లుగా వివిధస్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆజాద్ తెలిపారు. కేసీఆర్‌తోనూ సంప్రదింపులు జరిపామని ఆజాద్‌ ధృవీకరించారు. అయితే తెలంగాణపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని.. ఆ తర్వాతే కేంద్ర ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆజాద్ పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

Thursday, October 11, 2012

ఏ హొదాతో పాదయాత్రకు వెళతారు: శోభ


దోచుకోవడానికి రాష్ట్రంలో ఇంకా ఏమి మిగిలందని షర్మిల పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళధ్యక్షురాలు శోభాహైమవతి ప్రశ్నించారు.2003 లో వైఎస్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు,భూములు,సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే వాటిని దోచేశారని ఆరోపించారు. తండ్రి, కొడుకులు కలిసి రూ.లక్ష కోట్లు ప్రజా సొత్తును భోన్చేశారన్నారు.షర్మిల ఏ హొదాతో పాదయాత్ర చేపడతారని,ఏ హొదాలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని నిలదీశారు. పిల్ల కాంగ్రెస్ లో షర్మిల పదవి ఏంటని ప్రశ్నించారు.

జగన్ లైఫ్‌పై సినిమా

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రానుందట. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 1990లలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రాన్ని రీమేక్ చేయాలని విష్ణు భావిస్తున్నారు. చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పటికీ వైయస్ జగన్ ఆధారంగా చిత్రం ఉండేలా చూస్తున్నారట. జగన్ తన అరెస్టుకు ముందు మోహన్ బాబు ఇంటికి భార్య భారతితో సహా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. ఆయన మద్దతును జగన్ కోరారు. అయితే జగన్ ఇంటికి రావడంలో రాజకీయ ప్రాధాన్యత లేదని, తన తనయుడికి కవలలు పుట్టినందువల్లే చూసేందుకు వచ్చారని మోహన్ బాబు చెప్పారు. కానీ రాజకీయ ప్రాధాన్యత ఆ భేటీలో ఉందనేది పలువురి వాదన. ఆ తర్వాత జైలులో కూడా ఓసారి తనయుడితో వెళ్లి కలిశారు.

జగన్ సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి పాదయాత్ర

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం సాయంత్రం స్పష్టం చేశారు. 'మరో ప్రస్థానం' పేరుతో కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని విజయమ్మ వెల్లడించారు. సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో, ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా వైఎస్ స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు. 

Wednesday, October 10, 2012

జగన్ పార్టీలోకి మోహన్ బాబు !


కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన చర్యలను చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మోహన్ బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కొద్ది నెలలుగా ఆయన తాను తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెబుతూ వచ్చారు. ఆయన పొలిటికల్ రీఎంట్రీపై మాట్లాడగానే తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. తన గురువు దాసరి నారాయణ రావుకు ప్రాధాన్యత కల్పించడం, చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన నేపథ్యంలో మోహన్ బాబు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసులో చేరే అవకాశాలు లేవని తొలి నుండి అందరూ భావించిన విషయమే.
తన విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చాలాకాలం తర్వాత ఆహ్వానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. టిడిపిలో చేరేందుకు మోహన్ బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండుసార్లు చంద్రబాబుకు తనకు మధ్య చిన్న మనస్పర్థలు మాత్రమేనని, ఆయన పాలన బావుందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా అవినీతిలేని పార్టీలో చేరతానని, జర్నలిస్టులు ఏదో సూచించాలని కోరారు. అప్పటికే జగన్ పార్టీకి అవినీతి మచ్చ పడ్డ నేపథ్యంలో మోహన్ బాబు ఖచ్చితంగా టిడిపిలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అనూహ్యంగా మోహన్ బాబు ఇంటికి జగన్ రావడం, ఆ తర్వాత ఓసారి జైలులో కూడా తన తనయుడు విష్ణుతో కలిసి మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను కలవడం మరోసారి చర్చకు దారితీశాయి. అప్పుడు జగన్‌కు అనుకూలంగా మాట్లాడారు. రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ బయటకు వస్తాడని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. దీంతో మోహన్ బాబు టిడిపిపై యూ టర్న్ తీసుకున్నట్లుగా అర్థమైపోయింది. తాజాగా మోహన్ బాబు తనయుడు విష్ణు హీరోగా వస్తున్న ఓ చిత్రం జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

Monday, October 8, 2012

16 ఏళ్ల రాగానే పెళ్లి చేయండి!


 ఇటీవల హర్యానాలో రేప్ కేసుల సంఖ్య పెరగడంతో దానికి అక్కడి కాప్ పంచాయత్ పెద్దలు వింత పరిష్కారం చూపారు. యువతీయువకుల పెళ్లి వయస్సు తగ్గించి, వారికి 16 ఏళ్లకే పెళ్లి చేయాలని అప్పుడే అత్యాచార కేసులు తగ్గుముఖం పడతాయంటూ కొత్తభాష్యం చెప్పారు. అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక కొద్దిరోజులక్రితం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెలరోజుల్లో ఇలాంటివి 12 సంఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం జోక్యం చేసుకుని హర్యానా ప్రభుత్వానికి తలంటింది.
మరోవైపు ఈ ఘటనల వెనుక కుట్ర దాగుందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాప్ పెద్దలు తమదైన శైలిలో పరిష్కార మార్గం చెప్పారు. ‘‘16 ఏళ్లు రాగానే యువతీయువకులకు పెళ్లి చేస్తే.. వారు తప్పుదోవపట్టరు. తద్వారా రేప్ కేసులూ తగ్గుముఖం పడతాయి’’ అని ఓ కాప్ పెద్ద పేర్కొనగా.. రజస్వల కాగానే ఆడపిల్లకు పెళ్లి చేయాలని మరో పెద్దమనిషి ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు వరుస సంఘటన లపై హర్యానా ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఇందులో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేసింది. పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని ప్రకటించింది. అయితే సర్కారు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Sunday, October 7, 2012

తిరుమలలో శ్రీవారి లడ్డూల కొరత

 తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కొరత ఏర్పడింది. దీంతో అదనపు లడ్డూ టోకన్లను టీటీడీ కుదించింది. వారం రోజులుగా తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీకి తగట్టుగా లడ్డూ ప్రసాదాలను అందించారు. రోజువారి తయారీతో పోలిస్తే భక్తులకు పంపిణీ చేసిన లడ్డూలే అధికంగా ఉంది. దీంతో ఆలయ పోటులో నిల్వ ఉంచిన లడ్డూలను సైతం భక్తులకు అందించడంతో అయిపోయాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా తయారైన లడ్డూలు నేరుగా కౌంటర్లకు తరలించి తడిగా ఉన్న ప్రసాదాలనే భక్తులకు అందజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల లడ్డూలు నిల్వ ఉంచడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. దీంతో భక్తులకు అదనంగా జారీచేసే లడ్డూపడి టిక్కెట్లను కుదించారు. ఆదివారం ఉదయం నుంచి ఒకరికి నాలుగు లడ్డూల స్థానంలో రెండింటినే జారీ చేస్తున్నారు. దీనిపై కొందరు భక్తులు కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లడ్డూ కౌంటర్ల ప్రాంతానికి చేరుకుని భక్తులకు సమస్యను వివరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ లడ్డూ టోకన్ల కుదింపు విషయాన్ని ముందుగానే మైకుల ద్వారా, కౌంటర్ వద్ద సిబ్బందిచే భక్తులకు తెలియజేసి ఉంటే వ్యతిరేకత ఎదురయ్యేది కాదు.

Saturday, October 6, 2012

పాదయాత్ర లో చంద్రబాబు వెంట పరిటాల శ్రీరామ్

టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీ కోసం కార్యక్రమంలో భాగం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఐదో రోజు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. పేదలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు వెంట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారు.

Friday, October 5, 2012

జనం చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్...ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్


 'వస్తున్నా . . . మీకోసం' పాదయాత్రలో చంద్రబాబుకు జనం నుంచి వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అనంతపురం జిల్లా ఉరకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. రొద్దం మండలం రాగిమేకలపల్లి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారని తెలిసిందన్నారు. ఆయన సుదీర్ఘ యాత్రకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఓదార్చడానికి చంద్రబాబు పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయనను స్వాగతించాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టాలనే ఆలోచన మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ద్వారా చంద్రబాబు యాత్రను అడ్డగించి ఇబ్బంది కలిగించేలా మంత్రి, ఎంపీ కుట్ర పన్నుతున్నారన్నారు. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

2013లో రిటైర్మెంట్ ప్లాన్ ...సచిన్ టెండూల్కర్

 తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నోరు విప్పాడు. నవంబర్‌లో భవిష్యత్తుపై సమీక్షించుకుంటానని ఆయన అన్నారు. ఓ టెలివిజన్ చానెల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. "ఇప్పుడు నాకు 39 ఏళ్లు. ఇంకా చాలా క్రికెట్ ఆడుతానని అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు. రిటైర్మైంట్ గురించి ఆలోచిస్తున్నారా అని అడిగితే అవునని, ఆ విషయం ఆలోచిస్తున్నానని జవాబిచ్చారు. ఇప్పుడు తనకు 39 ఏళ్ల వయస్సు అని, దాని గురించి ఆలోచించడం అసాధారణమేమీ కాదని, తాను తన హృదయం చెప్పిన మాటే వింటానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నట్లు చెబుతోందని, సిరీస్‌కు, సిరీస్‌కు మధ్య ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లాండుతో జరిగే నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తాను ఆడుతానని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు తాను రిటైర్ కావాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు. నవంబర్‌లో ఆడిన తర్వాత తిరిగి సమీక్షించుకుని అంచనా వేసుకుంటానని అన్నారు.

జగన్ బెయిల్ పై డెడ్‌లైన్

జగన్ కేసుపై సిబిఐకి ఛార్జీషీట్ డెడ్‌లైన్ విధించింది. 2013 మార్చి 31వ తేదిలోగా ఈ కేసును ముగించాలని సిబిఐకి సూచించింది. తరుచూ ఛార్జీషీట్లు వేయవద్దని, ఒక్క ఛార్జీషీట్‌తోనే విచారణ ముగించాలని తెలిపింది. సిబిఐ మరింత సమయం కోరడంతో కోర్టు ఈ డెడ్ లైన్ విధించింది. విచారణ గడువు ముగిసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది. జగన్ తరఫున గోపాల సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌‌లు, సిబిఐ తరఫున అశోక్ బాన్, మోహన్ పరాశరణ్‌లు కోర్టులో తమ వాదనలు వినిపించారు.

జగన్‌ సుప్రీం కోర్టులో నో బెయిల్

 అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబాలన్, రంజనా దేశాయ్ తో కూడిన డివిజన్ బెంజ్ తిరస్కరించింది. దర్యాప్తు ముగిసేలోపు మళ్లీ బెయిల్ అడగవద్దని కోర్టు ఆదేశించింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీగా వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. సాక్షులను ఏవిధంగాను ప్రభావితం చేయలేదని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, ఇంకా వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, జగన్ సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని లాయర్లు కోర్టులో వాదించారు. సిబిఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు జగన్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. 

Thursday, October 4, 2012

జగన్ బెయిల్ కోసం గుళ్లలో పూజలు


వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని, ఆయనకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెయిల్ రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద 1,116 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ త్వరలో బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుండి మంకమ్మ తోట వరకు పాదయాత్ర చేసి, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. హైదరాబాదులోని అంబర్ పేట నుండి జిడి కాలనీ వరకు పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రేమికులపై దాడి

విహారానికి వచ్చిన ప్రేమికులపై గుర్తుతెలియని దుండుగులు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా టైగల్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు వీరు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు చెందిన అజిత, మునిరాజులుగా గుర్తించారు.

రాయలసీమ అభివృద్ధికి రూ. లక్ష కోట్లు ఇవ్వండి...మంత్రి టీజీ వెంకటేష్

రాయలసీమ అన్ని వనరులకు నిలయం అని, కాని వాస్తవానికి మాత్రం అల్లుని నోట్లో శని అన్నట్టు రాయలసీమలో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయని మంత్రి టి.జి. వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవితో మంత్రి టీజీ వెంకటేష్ బృందం గురువారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం మంత్రి టీజీ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అన్నివిధాల వెనుకబడి ఉందని సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వాయలార్‌ను కోరినట్లు తెలిపారు. రాయవసీమలో బంగారు గనులకు కొదవ లేదని, అలాగే వజ్రాలకు పెట్టింది పేరు అని, ఎన్నో వనరులు ఉన్నా ఫలితం మాత్రం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ బెయిల్‌పై సుప్రీంలో రేపు విచారణ

శుక్రవారం జగన్ బెయిల్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జగన్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇంతవరకు సీబీఐ, ఈడీలు చేసిన విచారణ వృధా అవుతుందని భావిస్తూ ఈడీ ఈరోజు అన్నీ ఆధారాలతో జగన్ అండ్ కో స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదించే వాదనలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝలిపించింది. జగన్మోహన్‌రెడ్డి ఆయన ద్వారా లబ్ది పొందిన వారి స్థిర చరాస్తులను ఈడీ గురువారం జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనగా ఈడీ నిర్ధారిస్తూ, రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ. 14 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి ప్రభుత్వం ద్వారా (అక్రమార్గంలో) పలు విధాలుగా అంటే సెజ్‌లు, ఇరిగేషన్, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గనుల కేటాయింపులు తదితర వాటి ద్వారా లభ్ది పొందిన కంపెనీలు, జగన్ సంస్థలకు పెట్టుబడుల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారించి, ఈ నేపథ్యంలోనే వారి ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. హెటోరో డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమి, మూడు కోట్ల రూపాయల పిక్సిడ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. ఆరబిందో ఫార్మాకు సంబంధించి 95 ఎకరాల భూమి, రూ. 3 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది. సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఆస్తులను జప్తు చేసింది. హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలు రూ.8.60 కోట్లు లబ్ధి పొందేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఈడీ నిర్దారించింది. ఈ రెండు సంస్థలకు ఏపీ ప్రభుత్వం 75 ఎకరాల చొప్పున భూమిని కేటాయించిందని పేర్కొంది. మరో సంస్థ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ 30.33 ఎకరాల భూమిని పొందడం ద్వారా రూ.4.30 కోట్లు లబ్ధి పొందిందని వివరించింది. భూముల కేటాయింపులో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి అడ్డదారిలో భూకేటాయింపులు జరిపిందని తెలిపింది. తదుపరి చర్యలకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది.

Wednesday, October 3, 2012

పవన్ కళ్యాణ్ సినిమా తో చేసే తీరిక లేదన్న... సమంత

కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అంటూ లేకుండా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఇటీవల గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సమంత ఖండించింది. ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది వరకు తన డేట్స్ ఖాళీగా లేవని స్పష్టం చేసింది. ‘గతంలో కమిట్ అయిన సినిమాలే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' అని స్పష్టం చేసింది. ఇటీవల సమంత నటించిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణం కొంత కాలంగా షూటింగులకు దూరమైన సమంత ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

పార్టీలోకి రావడానికి పర్మిషన్ అవసరంలేదు...నారా లోకేష్

పార్టీలోకి రావడానికి తనకు ఎవరి అనుమతి అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం అన్నారు. తండ్రి పాదయాత్రలో పాలుపంచుకుంటున్న లోకేష్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ప్రజల సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్నారు. తాను 1995 నుండే పార్టీ కోసం పని చేస్తున్నానని, 1999 నుండి క్రియాశీలకంగా ఉన్నానని, పార్టీలోకి వచ్చేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లెక్కలేనన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు వేచి చూస్తున్నారన్నారు. రాజకీయాలలోకి రావడం గొప్ప విషయమేమీ కాదన్నారు. కుప్పం నుండి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. దానికి లోకేష్... కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. 2009 ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. ఇకపై పార్టీ పటిష్టతపై సీరియస్‌గా దృష్టి సారిస్తానని లోకేష్ చెప్పారు. పాదయాత్రకు కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు.

కేసీఆర్ పై హైకోర్టు విచారణ

ప్రభుత్వం కేటాయించిన భూమిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నరని ఆయన మేనల్లుడు ఉమేష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉమేష్ రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ప్రభుత్వం నుండి తీసుకున్న భూమిలో నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంతో ప్రైవేటు న్యూస్ ఛానల్ ను నడపడంపై ఉమేష్ రావు గతంలో కేసీఆర్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

క్రికెటర్ల గదుల వద్ద అమ్మాయిల అరెస్ట్!

వెస్టిండీస్ క్రికెటర్ల గదుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముగ్గురు బ్రిటన్ జాతీయ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లోని విండీస్ క్రికెటర్ల గదుల్లోకి అనధికారికంగా వెల్లడానికి ప్రయత్నించడంతో మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సిన్నమోన్ గార్డెన్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ట మధ్య మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకుంది.

తెలంగాణపై ఇప్పట్లో రాదు...మంత్రి టీజీ

 ప్రత్యేక తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశంలేదని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 2014 సాధారణ ఎన్నికలకు ఆరె నెలల ముందు తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువడనుందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానం కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని మంత్రి టీజీ తెలిపారు.

తప్పులు సరిదిద్దుకుని మంచి పాలన అందిస్తా...చంద్రబాబు

తొలిరోజు పాదయాత్రలో జననీరాజనాలు అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజైన బుధవారం కోళ్లకుంటనుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు దాదాపు 18 కి.మీ వరకు పాదయాత్ర సాగనుంది. 8 నుంచి 10 గ్రామాల్లో బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు. రెండో రోజు ప్రాదయాత్రలో కూడా బాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ నాయుడు ఉన్నారు. బుధావారం ఉదయం హిందూపురం నియోజకవర్గం కోళ్లకుంట నుంచి బాబు పాదయాత్రను ప్రార ంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ టీడీపీ హయాంలో ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్గుకొని మంచి పాలన అందిస్తానని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలో ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేశామన్నారు. కానీ కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రం ప్రజల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదవారికి న్యాయం జరగాలనే తాను ఈ యాత్రను చేపట్టానని తెలిపారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సమ న్యాయం జరగాలన్నారు. కానీ కాంగ్రెసు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, దానిని విదేశాలలో దాచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పేదవారికి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైనా 14 శాతం పన్ను విధించిందని విమర్శించారు.

Monday, October 1, 2012

'గుండెల్లో గోదారి' ఫొటోఫై చర్యలు తీసుకుంటాం... మంచు లక్ష్మీప్రసన్న


 మలయాళంలో మమ్ముట్టి, తాప్సీ నటించిన డబుల్స్ అనే చిత్రాన్ని తమిళంలో ‘పుదువై మనగరమ్' పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ‘గుండెల్లో గోదారి'లోని తాప్సీ ఫొటోలను వినియోగిస్తున్నారని, ఇది అభ్యంతరకరమని లక్ష్మీ చెబుతూ, ఈ విషయాన్ని తమిళనాడు నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఆ సినిమా ప్రచారం కోసం 'గుండెల్లో గోదారి'లోని తాప్సి ఫొటోలను వాడుకుంటున్నారు. ''ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము'' అన్నారు లక్ష్మీ ప్రసన్న.గుండెల్లో గోదారి ఓ సాహసోపేతమైన ప్రేమకథ. వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకొన్నాము. 1980 కాలంలో నడిచే కథ ఇది. ఇళయరాజా ఆరు బాణీలను అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 'సినిమా విడుదలైన తరవాతే ఇవ్వు' అన్నారు. ఆ మాట ఎంతో సంతోషాన్నిచ్చింది' 'అని ఆమె చెప్పారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో పాటల్ని, నవంబరు మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తారు.

బాబు యాత్ర ఎందుకో తెలియదు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తనకు తెలియదని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి పెనుకొండకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు పా దయాత్రపై మీ స్పందన ఏమిటంటూ విలేఖరులు అడగటంతో పైవిధంగా స్పందించారు.

చంద్రబాబుకు కలిసిరాని కాలం!


 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుచంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది మొదలు పెట్టినా బెడిసికొడుతోంది. ఆయన విధానాలన్నీ తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ బలహీనపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హర్షించలేదు. ఇరు ప్రాంతాల వారు విమర్శించారు. తెలంగాణ వారు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏం చేస్తే అది చేసి నవ్వుల పాలయ్యారు. ఆ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నాలు, దీక్షలు చేస్తే దీక్షలు చేశారు. ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కాపీ కార్యక్రమాలే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అర్ధంపర్ధంలేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా బలహీనపడింది. ఉప ఎన్నికలలో పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమని, ఈ అంశాన్ని త్వరగా తేల్చమని చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం వివాదాలకు దారి తీసింది. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే చిచ్చు రగిల్చింది. ఈ లేఖతో తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించారు. బాబు లేఖల పేరుతో మోసం చేస్తున్నారని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. లేఖలో స్పష్టత ఏముందో చెప్పాలని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. లేఖల రాజకీయంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేశారని తెలంగాణవాదులు అంటే, సొంత జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబును చెప్పులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పి, వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు తాము వెయ్యి కిలో మీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. తమ యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుందని ఆయన వివరించారు. చంద్రబాబు పాదయాత్రకు సహకరించేది లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తెగేసి చెప్పారు. లేఖ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని అమరనాథ రెడ్డి బాధపడ్డారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బాబు వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ హీనస్థితికి చేరిందన్నారు. పార్టీని ఆయన అధోగతి పాలు చేశారన్నారు. పార్టీ అధినేత అయిన తననే ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో చూస్తే అలా ఉంది, సీమలో చూస్తే ఇలా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు వలసబాట పట్టారు. 2009 ఎన్నికలలో టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర రెడ్డి, వేణుగోపాల చారి, నాగం జనార్ధన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డి, కొడాలి నాని, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటర్లు టిడిపికి చుక్కలు చూపించారు. పరిస్థితి ఇలా ఉన్నా చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీమీద మమకారం చావలేదు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ' రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నాను. సమస్యలు చూసి ఓదార్చడం కాకుండా వారిలో చైతన్యం తెచ్చి పరిష్కార దిశగా కృషి చేయాలి. మళ్లీ నేను సీఎంని అవుతాను. మధ్యతరగతిలో పుట్టినప్పటికీ ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాను. మహాత్మాగాంధీ, పూలే, ఎన్టీఆర్ సైతం అలాంటి స్థితిలోనే జన్మించి అనుక్నుది సాధించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని కృషిచేయాలి’ ' అని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల బిసి డిక్లరేషన్, ఎస్ సి డిక్లరేషన్, ముస్లింలకు ఉప ప్రణాళిక....... అని చెబుతున్నారు. పదవీ వ్యామోహం ఆయనతో ఇలా మాట్లాడిస్తోంది.

Sunday, September 30, 2012

భాగ్యనగరం రణరంగమైంది

భాగ్యనగరం రణరంగమైంది. పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలు లెక్క చేయకుండా, బారీకేడ్లను తొలగించి, ముళ్లకంచెలపై నుండి దూకి తెలంగాణవాదులు చీమలదండులా సాగర హారానికి తరలి వచ్చారు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు సాగర్‌ను వదిలేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తాము శాంతియుతంగా కవాతు చేయడానికి సిద్ధమైనతే పోలీసులు తమపై నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని, తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినప్పటికీ తెలంగాణవాదులు ఎలాంటి హింసామార్గాన్ని చేపట్టకుండా లక్షలాదిగా తరలి వచ్చారని అంటున్నారు. జనసాగరంగా మారిన సాగరహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, ప్రజా సంఘాలు ఇలా ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణవాదులు సాగర తీరానికి చేరుకున్నారు. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ అన్నీ ఇసుక వేస్తే రాలనంతగా మారాయి. నేల ఈనిందా అన్న మాదిరిగా నెక్లెస్ రోడ్డు తెలంగాణవాదులతో నిండిపోయింది. నగరం మొత్తం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మూడు గంటలకే ప్రారంభమవుతుందనుకున్న సాగరహారం అరెస్టులు, నిర్బంధాల కారణంగా రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకుముందు వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. అరెస్టులను నిరసిస్తూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిశారు. టిటిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సొంత పార్టీ నేతల నుండి కిరణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కిరణ్, డిజిపి వైఖరిపై నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓ అడుగు ముందుకేసి... తెలంగాణవాదులను రెచ్చగొడితే తాము పదవులను త్యజించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. మధ్యాహ్నం అనుకున్న సమయానికి ఆయా పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీలు నిర్దేషిత ప్రాంతాల నుండి ప్రారంభమయ్యాయి. పోలీసులు ర్యాలీలను ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులపై తెలంగాణవాదులదే పైచేయి అయింది. ఎక్కడికి అక్కడ పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కాలు కాలు కదిపి కదం తొక్కారు. డిజిపి దినేష్ రెడ్డి నగరంలో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. తూటాలకు వెన్నుచూపని ఓయు విద్యార్థులు! కవాతు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. ఓయు విద్యార్థులు బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకొని ముందుకు కదలనివ్వలేదు. తాము బైక్ ర్యాలీతోనే వెళ్తామని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులు కూడా అంతే ధీటుగా పోలీసుల పైకి రాళ్ల వర్షం కురిపించారు. శాంతియుతంగా కవాతు చేస్తామని.. అనుమతిస్తే మంచిదని లేకుంటే తాము అదే తీరుగా స్పందిస్తామని పోలీసులు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ విద్యార్థికి రబ్బరు తూటా తగిలి గాయమైంది. తూటా తగిలినా, బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ విద్యార్థులు వెనుకంజ వేయలేదు. నెక్లెస్ రెడ్డు తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతరను తలపించింది.