http://apvarthalu.com/

Wednesday, November 14, 2012

సీమాంధ్ర పార్టీలను తరిమికొట్టాలి... టీఆర్ఎస్

తెలంగాణ జిల్లాల్లో సీమాంధ్ర పార్టీ లను తరిమి కొ ట్టాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ శాసం రామకృష్ణ అన్నారు. మండల పరిధి దేవరఫస్లాబాద్ పంచాయతీ లొట్టికుంటతండాలో సోమవారం పార్టీ జెం డాను ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించకుండా దొంగతనంగా సీమాంధ్ర ప్రాంతాలకు తరలించుకుపోతున్నా పాలకులు అడ్డు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఆస్తులను సీమాం«ద్రులు ఇష్టనుసారం తమ ప్రాంతాలకు తరలించుకుని పోతున్నా ఏమీ పట్టనట్లు పాలకులు వ్యవహరిస్తుండడం చూస్తుంటే తెలంగాణ ప్రాంతాల పట్ల వారికి గల వివక్ష అర్థమవుతోందని అన్నారు. తెలంగాణ సాధన కోసం దాదాపు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్లుగా కూడా లేద న్నారు.

No comments: