http://apvarthalu.com/

Tuesday, November 13, 2012

రాష్ట్రంలో రెచ్చిపోతున్న హిజ్రాలు

                                           
రాష్ట్రంలో పలు చోట్ల హిజ్రాలు రెచ్చిపోతున్నారు. కేవలం యాచకులుగా భావించి ప్రజలు, పోలీసులు వారిని అలా వదిలివేయడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లింగపరమైన సమస్య తప్ప వారికి ఏ లోపం ఉండదు. కొందరు లింగమార్పిడి చేసుకున్నవారు కూడా ఉంటారు. ఇటీవల కాలంలో లింగమార్పిడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వారు అన్ని రకాల పనులు చేయగలరు. చేస్తారు కూడా. ఏ పని చేయడానికైనా వారి శరీరం అనువుగానే ఉంటుంది. కానీ వారిలో ఎక్కువ మంది పనిపాట లేకుండా చప్పట్లు కొడుతూ యాచనకు అలవాటుపడిపోయారు. ఏ పని చేయకుండా కాలం గడిచిపోతుండటంతో వారు అరాచకాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, దోపిడీలకు కూడా తెగబడుతున్నారు. లింగ మార్పిడి చేసుకున్న కొందరు వ్యభిచారానికి అలవాటు పడితే, మరికొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు ప్రాంతాలలో వారు తమ వికృత చేష్టలతో యువతీయువకులను, బాలురను వేధిస్తున్నారు. ముఖ్యంగా వారు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, బైపాస్ రోడ్లలో ఎక్కవగా ఉంటారు. రైళ్లలో వారి ఆగడాలకు హద్దులు లేవు. రైల్వే పోలీసులు చూసిచూడనట్లు వదిలివేయడంతో వారు రెచ్చిపోతున్నారు. రైళ్లలో చప్పట్లు చరుస్తూ వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడతారు. వారు అడిగినంత ఇవ్వాలి. ఇవ్వకపోతే హింసే. కుర్రవాళ్లని నానారకాలుగా ఇబ్బందిపెడతారు. వారిమీదకు ఎగబడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని దోచేస్తారు. వారికి ఎదురు తిరిగి నిలబడటం కష్టం. మహిళలను కూడా వేధిస్తారు. వికృత చేష్టలతో హింసిస్తారు. కొన్ని సందర్భాలలో వారి చేష్టల వల్ల ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. బైపాస్ రోడ్లలో రాత్రి అవ్వగానే మొదలుపెట్టి, తెల్లవారుజాము వరకు అక్రమవసూళ్లు కొనసాగిస్తారు. వాహనదారులను వేధిస్తారు. డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారు. 

No comments: