http://apvarthalu.com/

Sunday, September 30, 2012

భాగ్యనగరం రణరంగమైంది

భాగ్యనగరం రణరంగమైంది. పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలు లెక్క చేయకుండా, బారీకేడ్లను తొలగించి, ముళ్లకంచెలపై నుండి దూకి తెలంగాణవాదులు చీమలదండులా సాగర హారానికి తరలి వచ్చారు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు సాగర్‌ను వదిలేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తాము శాంతియుతంగా కవాతు చేయడానికి సిద్ధమైనతే పోలీసులు తమపై నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని, తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినప్పటికీ తెలంగాణవాదులు ఎలాంటి హింసామార్గాన్ని చేపట్టకుండా లక్షలాదిగా తరలి వచ్చారని అంటున్నారు. జనసాగరంగా మారిన సాగరహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, ప్రజా సంఘాలు ఇలా ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణవాదులు సాగర తీరానికి చేరుకున్నారు. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ అన్నీ ఇసుక వేస్తే రాలనంతగా మారాయి. నేల ఈనిందా అన్న మాదిరిగా నెక్లెస్ రోడ్డు తెలంగాణవాదులతో నిండిపోయింది. నగరం మొత్తం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మూడు గంటలకే ప్రారంభమవుతుందనుకున్న సాగరహారం అరెస్టులు, నిర్బంధాల కారణంగా రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకుముందు వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. అరెస్టులను నిరసిస్తూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిశారు. టిటిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సొంత పార్టీ నేతల నుండి కిరణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కిరణ్, డిజిపి వైఖరిపై నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓ అడుగు ముందుకేసి... తెలంగాణవాదులను రెచ్చగొడితే తాము పదవులను త్యజించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. మధ్యాహ్నం అనుకున్న సమయానికి ఆయా పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీలు నిర్దేషిత ప్రాంతాల నుండి ప్రారంభమయ్యాయి. పోలీసులు ర్యాలీలను ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులపై తెలంగాణవాదులదే పైచేయి అయింది. ఎక్కడికి అక్కడ పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కాలు కాలు కదిపి కదం తొక్కారు. డిజిపి దినేష్ రెడ్డి నగరంలో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. తూటాలకు వెన్నుచూపని ఓయు విద్యార్థులు! కవాతు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. ఓయు విద్యార్థులు బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకొని ముందుకు కదలనివ్వలేదు. తాము బైక్ ర్యాలీతోనే వెళ్తామని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులు కూడా అంతే ధీటుగా పోలీసుల పైకి రాళ్ల వర్షం కురిపించారు. శాంతియుతంగా కవాతు చేస్తామని.. అనుమతిస్తే మంచిదని లేకుంటే తాము అదే తీరుగా స్పందిస్తామని పోలీసులు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ విద్యార్థికి రబ్బరు తూటా తగిలి గాయమైంది. తూటా తగిలినా, బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ విద్యార్థులు వెనుకంజ వేయలేదు. నెక్లెస్ రెడ్డు తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతరను తలపించింది.

Saturday, September 29, 2012

హైదరాబాద్ గణనాథునికి ఘన వీడ్కోలు

 హైదరాబాద్ నగరం భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తజనం నామస్మరణ. ఒకవైపు చిరుజల్లులతో మొదలైన వర్షం జోరుగా కురిసినా.. భక్తకోటి ఉత్సాహాన్ని అది అడ్డుకోలేకపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి భక్తులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చ రిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రాత్రి ఒంటిగంట లోపే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయింది. రాత్రి 11 గంటల సమయానికి 4,350 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12-1 మధ్య మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, కూకట్‌పల్లి, ఐడీపీఎల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన పర్వం కొనసాగింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేశ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అత్తాపూర్‌లో హైటెన్షన్ తీగలకు జెండా తగిలి విద్యుదాఘాతంతో ఆరుగురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా జరిగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకుంది.

దేశంలో పెరిగిపోయిన అవినీతి

దేశంలో అన్ని విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లోని రెవెన్యూ కళ్యాణమండపంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సహకార దినోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. జీడీసీసీబీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కాసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశంలో ఎక్కువ మందికి సహకార రంగంతో ప్రమేయం ఉందన్నారు. ఈ రంగం పటిష్టంగా ఉంటే పేద వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సహకార వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

Thursday, September 27, 2012

వస్తున్నా మీకోసం: బాబు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు


అక్టోబర్ 2వ తారీఖు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోయే పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ ఖరారైంది. అనంతపురం జిల్లా హిందూపురం నుండి బాబు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. స్థానికంగా ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రబాబు నిర్వహించే ఈ పాదయాత్రకు వస్తున్నా మీకోసం అనే పేరును పెట్టారు. హిందూపురం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. టిడిపి తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిని ప్రజలకు తెలియజేస్తామని, బాబుకు విల్ పవర్ ఉంద్నారు.
చంద్రబాబు అంతకుముందు అదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి లేదా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుండి పాదయాత్ర చేపట్టాలని చూశారు. కొడంగల్ నుండి దాదాపు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో అది కూడా రద్దయింది. ఈరోజు అధికారికంగా హిందూపురం నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాగా బాబు పాదయాత్ర కోసం సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, హరిరామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలకు వందేమాతరం శ్రీనివాసం సంగీతం అందించారు. అన్నా స్టూడియోలో రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. బాబు మార్చింగ్ పైన, బాబు వస్తున్నాడని ఇలా అర్థం వచ్చేట్టు పాటలను రాశారు.



బాబు లేఖ పెద్ద డ్రామా... గంటా

ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖ పెద్ద డ్రామా అని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ బాక్సైట్ త్రవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందే అని ఆయన అన్నారు. విశాఖలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో 144 సెక్షన్

ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరమంతటా నవంబర్ 18 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ సీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలను కూడా ఈ నిషేధాజ్ఞల పరిధిలో చేర్చారు. నగరంలో ఎక్కడా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుపరాదని నిషేధాజ్ఞల్లో పేర్కొన్నారు.

ఓయూలో టెన్షన్...టెన్షన్

 ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా గురువారం ఉదయం కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారకం జలదృశ్యం వద్దకు ఓయూ విద్యార్థి జేఏసీ ర్యాలీ ప్రారంభించారు. అయితే భారీగా పోలీసులు బలగాలు అక్కడకు చేరుకుని విద్యార్థులను అడ్డుకుని బయటకు రాకుండా ఎన్‌సీసీ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులు కవాతుకు అనుమతించమని భీష్మించుకు కూర్చున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కవాతును జరిపితీరుతామని గేట్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి తెలంగాణ విద్యార్థుల ఆందోళనతో గురువారం అట్టుడికింది. సచివాలయ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు విశ్వవిద్యాలయం గేటు వద్ద అడ్డుకున్నారు. తాము జలదృశ్యం వరకు వెళ్లి ఇటీవల మరణించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించి వెనక్కి వస్తామని, కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్థులు చెబుతున్నా పోలీసులు వినలేదు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

రాహుల్‌కు మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తా...ప్రధాని

కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రివర్గంలోకి రావడాన్ని తాను స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. రాహుల్‌కు తన ఆహ్వానం ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వంలో చేరాలని ఇప్పటికే పలుమార్లు ఆయన్ను కోరానని శనివారమిక్కడి రాష్ట్రపతి భవన్‌లో మీడియాతో అన్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పెద్దపాత్ర పోషించేం దుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల రాహుల్ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇప్పటికే గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ వం టి నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతూనే.. కేంద్ర మంత్రులుగా ఉన్న సంగతిని కాంగ్రెస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవాలని వారు కోరుతున్నారు. పార్టీ ఉపాధ్యక్ష పదవి లేదా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆశిస్తున్నారు.

Wednesday, September 26, 2012

తెలంగాణ ఎక్కడ ఉందో 30న తెలుస్తుంది

 తెలంగాణ ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 30న ప్రజలు చూపిస్తారని బిజెపి ఎంపి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మోసపోతారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100రోజులలోనే తెలంగాణ ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో పోలీసులకు ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు

రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. జీవవైవిద్య సదస్సుకు వచ్చే వీవీఐపీలకు హైసెక్యూరిటీ కల్పించాలని తెలిపింది. విదేశీ ప్రతినిధులకు ఒక్కొక్కరికీ బాడీగార్డులను నియామకం జరగనుంది. ఉగ్రవాదులు, ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై పోలీసులకు ఐబీ సూచనలు జారీ చేసింది.

సీఎంని గొర్రెల కాపరితో పోల్చిన లగడపాటి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపి లగడపాటి రాజగోపాల్ గొర్రెల కాపరితో పోల్చారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి 9 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఒకప్పుడు గొర్రెల కాపరి అని తెలిపారు. గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి సక్రమంగా నడిపించారన్నారు. సీఎం కిరణ్ కూడా అలాగే మన రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తారన్నారు.

Friday, September 21, 2012

అల్లు అర్జున్ సరసన కాజల్ లవ్ స్టోరీ


                                  
రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్య 2 చిత్రంలో ఈ జంట రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఈ జంట మద్య లవ్ స్టోరీని బాగా పండించటానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ పదిహేను నిముషాలు పాటు ఉంటుందని అంటున్నారు. ఓ పాట, రెండు ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆ లవ్ స్టోరీ చాలా స్పీట్ గా నడిపి కథకు కీలకంగా మార్చనున్నారని తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకునే సినిమా మొత్తం నడుస్తుందంటున్నారు.

Thursday, September 20, 2012

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా...శేఖర్ కమ్ముల


దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...‘నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.

సింహవాహనంపై మురిపించిన శ్రీనివాసుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామి సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం స్వామివారి ఉత్సవర్లయిన మలయప్పకు విశేష సమర్పణ గావించారు. అనంతరం స్వామివారు వాహనమండపానికి వేంచేశారు. అక్కడ వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి సింహవాహనాన్ని అధిరోహించారు. మృగరాజైన సింహాన్ని లోబరుచుకుని వాహనం చేసుకున్న ఆనందంతో యోగముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీ«ధులలో రెండు గంటలపాటు సాగిన స్వామివారి ఊరేగింపు భక్తులను తన్మయులను చేసింది. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామికి, దేవేరులు శ్రీదేవి,భూదేవిలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. ఉత్సవర్లకు విశేష సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రాష్ట్రంలో పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి


డీ జిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పెంచిన ధరలు తగ్గించాలని డిమాంద్ చేస్తూ విపక్షాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. బంద్‌కు మద్దతు తెలుపుతూ విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న విపక్షాల నేతలు, కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులను నిలిపివేశారు.
* హైదరాబాద్ : బంద్ సందర్భంగా ఎంజీబీఎస్ బస్‌స్టాండ్ ఎదుట వాపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం సీపీఐ నేత నారాయణ సహా, టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* విశాఖపట్నం : మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు.
* విజయనగరం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
* మహబూబ్‌నగర్ : జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* చిత్తూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* విజయవాడ : నగరంలోని బస్టాండ్ దగ్గర విపక్షాలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఏలూరు రోడ్డులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. సీపీఎం నేత బాబూరావు సహా, పలువురిని అరెస్ట్ చేవారు.
* కృష్ణా జిల్లా : జిల్లాలోని కైకలూరులో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రభుత్వ, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* వరంగల్ : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్ష నేతలు ఆందోలనలకు దిగాయి. హన్మకొండ, పరకాల బస్టాండ్ దగ్గర టీడీపీ, బీజేపీ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* మెదక్ : జిల్లాలో వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
* ఖమ్మం : జిల్లాలోని ఆరు డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వైరా రోడ్డులోని పెట్రోల్ బంక్‌పై ఆందోళకారులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
* నల్గొండ : బంద్ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు బైఠాయించి నిరసన చేశారు.

Monday, September 17, 2012

ఓయూ ఉద్రిక్తత

                              
ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ విద్యార్థి జేఏసీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను ఎగుర వేసి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లేందుకు బయలు దేరగా ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15ను ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటుందో అదే మాదిరిగా తెలంగాణ విమోచన దినాన్ని కూడా అధికారికంగా జరపాలని, జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. కాగా పోలీసుల కళ్లుగప్పి కొంత మంది ఓయూ విద్యార్థులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, కొందరు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జై తెలంగాణ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. తెలంగాణ శాసనసభ్యులు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. 

సీతమ్మ వాకిట్లో మహేష్,సమంత పెళ్ళి


                                   
చెన్నై శివారు కొబ్బరి తోటలో ఓ సెట్ వేసి మహేష్,సమంత పెళ్ళికి సంబంధంచిన ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.వెంకటేష్, మహేష్‌బాబు, సమంత, అంజలి కాంబినేషన్‌లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. చలి పులి పంజా విసిరే సమయంలో సందడి చేసేందుకు వెంకటేష్‌, మహేష్‌బాబు సన్నద్ధమవుతున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ...''పదహారణాల తెలుగుదనాన్ని ఆవిష్కరించే కుటుంబ కథా చిత్రమిది. ఇటీవలే చెన్నైలో పెళ్లి పాటతోపాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించాం. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో కోటి రూపాయల వ్యయంతో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ భారీ సెట్‌ నిర్మించాం. అక్కడ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల్ని త్వరలో చిత్రీకరిస్తాం. ఈ సినిమాలో అయిదు పాటలున్నాయి. ఇప్పటికే మూడింటిని చిత్రీకరించాం. నవంబరులో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

శాసనసభలో రగడ తెలంగాణ తీర్మానం కోసం టీఆర్ఎస్ పట్టు


                                         
శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన వెంటనే విపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనంటూ విపక్షాల సభ్యులు పట్టుపట్టారు. దీంతో అసెంబ్లీలో రగడ నెలకొని సభ గంటపాటు వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం తిరిగి అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమయింది. విద్యుత్ సమస్యపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒకానొక దశలో సభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ స«భ సజావుగా నడిపేందుకు సహకరించాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు వినలేదు. దీంతో సభను మళ్ళీ అరగంటపాటు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ సజావుగా నడిపే వాతావరణం కనిపించలేదు. విపక్షాలు తాము పట్టిన పట్టు వీడతేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
వాయిదా తీర్మానాలు : విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఫీ రియంబర్స్‌మెంట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, తెలంగాణ విమోచనా దినం అధికారికంగా ప్రకటించాలంటూ బీజేపీ, ఫించన్ చెల్లింపులో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

Thursday, September 13, 2012

చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ. 35.59 కోట్లు

                                                 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను గురువారం ప్రకటించారు. ప్రతిఏటా తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని అన్నారు. తాను ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రి వర్గంలో చలనం వచ్చిందన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయందని, దేశం బాగుపడాలంటే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తన నివాసం నుంచి గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కామన్వెల్త్, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం, అలాగే రాష్ట్రంలో ఓఎంసీ, స్టాంపుల కుంభకోణం ఇలాంటి అవినీతిపై తాము పోరాటం చేస్తుంటే ఎదురుదాడి చేసి నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు. అటు కేంద్రంలో కూడా ఇదే పరిస్థితిలో ఉందని చంద్రబాబు విమర్శించారు.

కొందరు నేతలు రాజకీయాలను స్వార్ధం కోసం వాడుకుని కోట్ల రూపాయలు కూడబెదుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమలాగే మిగతా రాజకీయనాయకులు వారి ఆస్తులను ప్రకటించాలని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పార్టీ పెట్టి పరపతిని కోల్పోయారని అన్నారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబు అవినీతిపై పోరాటం చేస్తునే ఉన్నారని అన్నారు.

భువనేశ్వరి (చంద్రబాబు సతీమణి) నిర్వహిస్తున్న వ్యాపారాలకు ఎక్కడా ప్రభుత్వ భూమి కానీ ఇతర లబ్ది కానీ పొందలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు ఎకరాలు, రెండువేల కోట్ల రూపాయలు అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. సింగపూర్‌లో హోటల్స్ ఉన్నాయని చెప్పిన వారు నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు.

ఆస్తుల వివరాలు :
తమ కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ : రూ. 35.59 కోట్లు
చంద్రబాబు పేరున ఉన్న ఆస్తి : రూ. 31.97 లక్షలు
1985 నుంచి 1992 మధ్యలో నిర్మించిన ఇల్లు, కారు చంద్రబాబు పేరుమీద ఉన్నాయి.
భువనేశ్వరి పేరుమీద ఉన్న ఆస్తుల విలువ : రూ. 24.57 కోట్లు.
కుమారుడు లోక్‌ష్ పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 6.62 కోట్లు
కోడలు బ్రహ్మణి పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 2.09 కోట్లు.
అలాగే అప్పులు కూడా ఉన్నాయని భువనేశ్వరి పేరు మీద అప్పులు : రూ. 12.38 కోట్లు, లోకేష్ నాయుడు పేరు మీద : రూ. 9 లక్షలు అప్పులు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Wednesday, September 12, 2012

బొత్స,చిరు మధ్య ఉప్పు-నిప్పుగా మారిన మాటల


                                  
అధికార కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొదట్లో ఒకే గ్రూపుగా ఉన్న పిసిసి చీఫ్‌ బొత్స....ఎంపీ చిరంజీవి ఇపుడు ఉప్పు....నిప్పుగా మారారు. వీరి మధ్య ఇపుడు మాటకు మాట నడుస్తోందనడానికి ఈ ఇద్దరు నేతల తాజా కామెంట్సే నిదర్శనం.
గ్రూపు రాజకీయాలకు నిలయమైన అధికార కాంగ్రెస్‌లో సమీకరణాలు పార్టీ నేతలే ఆశ్చర్యపోయేలా మారుతున్నాయి. ఒకే గూటి పక్షులుగా ఉన్న పిసిసి చీఫ్‌ బొత్స... ఎంపీ చిరంజీవి మధ్య ఇపుడు మాటల తూటాలు పేలుతున్నాయి. సిఎం, పిసిసి చీఫ్‌లను మారుస్తారంటూ పార్టీలో ప్రచారం జరగుతున్న నేపధ్యంలో ... బొత్స పనితీరు బాగాలేదంటూ సోనియా వద్ద చిరంజీవి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఉప ఎన్నికల ఓటమిపై పార్టీ నేతలతో మేధోమధనం నిర్వహించాలంటూ ఎంపీ వి.హనుమంతారావు చేసిన డిమాండ్‌ను పిసిసి చీఫ్‌ బొత్స తిరస్కరిస్తే.. చిరంజీవి ఆ సమావేశానికి హాజరయ్యారు. పైగా బొత్స వైఫల్యాన్ని ఎత్తిచూపే వ్యాఖ్యలు చేశారు. పిసిసి చీఫ్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి సిఎం కిరణ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు నడుపుతున్న బొత్స కాంగ్రెస్‌లో చిరంజీవి విలీనం అయ్యాక....ఆయనను తన గ్రూపులో కలుపుకున్నారు. గత డిసెంబర్‌లో అవిశ్వాసం సందర్భంగా కూడా చిరంజీవితో అసమ్మతి చిచ్చు రేపి .... తర్వాత దాన్ని తానే చల్లార్చినట్టు కనిపించే డ్రామాను కూడా రక్తికట్టించిన బొత్స దూకుడు ఎక్కువ కాలం చెల్లుబాటు కాలేదు. తనను అడ్డం పెట్టకుని బొత్స అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారని.... అది తనకు ఇబ్బందిగా మారుతోందని గ్రహించిన చిరంజీవి క్రమేణ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ సిండికేట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిఎంకు లేఖ రాసిన చిరంజీవి....సిండికేట్‌ను వెనకుండి నడిపిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలనడంతో ఆయనకు బొత్సకు మధ్య విభేదాలకు బీజం వేసింది. అప్పట్నుంచి చిరంజీవి సిఎం కిరణ్‌కు అనుకూలంగా మారడమే కాకుండా తన ఎమ్మెల్యేలను ఇద్దరు మంత్రులను కూడా సిఎంకు మద్దతిచ్చేలా చేశారు. ఈ పరిణమాలను బొత్స జీర్ణించుకోలేక పోయారు. చిరంజీవి తనకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా తన నాయకత్వాన్ని కూడా ప్రశ్నించడంతో ఆయనపై సెటైర్లు వేశారు. అసమ్మతి రాజకీయాల కారణంగా పిసిసి చీఫ్‌ పదవిని బొత్స త్వరలోనే కోల్పోవాల్సి వస్తుందనేది కాంగ్రెస్‌ నేతల అంచనా. హై కమాండ్‌ ఆశీస్సులుంటేనే గ్రూపు రాజకీయాలతో ప్రయోజనముంటుందని.... లేదంటే ఇబ్బందులు తప్పవంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.

Tuesday, September 11, 2012

నాగార్జున నటన అద్భుతం...చిరంజీవి

                                         
నాగార్జున, రాఘవేందర్రావు కాంబినేషన్లో రూపొందిన మరో భక్తి రస చిత్రం శిరిడి సాయి. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ప్రసాద్‌ ల్యాబ్‌ లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... శిరిడి సాయి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం చాలా హృద్యంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశం చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్‌.... చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యానన్నారు. శిరిడి సాయిగా నాగార్జున అద్భుతంగా నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు... ఇప్పుడు శిరిడి సాయి చిత్రాలతో నాగార్జున జన్మ ధన్యమైంది. సాయి జీవిత చరిత్రను చదివాను. ఇప్పడు శిరిడి సాయి సినిమా చూస్తుంటే కళ్లకు కట్టినట్టుగా అనిపించింది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలను రాఘవేంద్రరావు కాకపోతే ఇంతలా రూపుదిద్దుకునేది కాదు. నిర్మాత మహేష్‌రెడ్డి సాయి తత్వాన్ని అందరికీ తెలియ చేయాలని శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించారు’ అని వ్యాఖ్యానించారు. శిరిడి సాయి చిత్ర యూనిట్‌ వెైజాగ్‌ నుంచి విజయ యాత్ర నేడు ప్రారంభించనున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్‌ రెడ్డి తదితరులు ఈ యాత్రలో పాల్గొంటారు.

బెంగాలీలో ఎన్టీఆర్‌

                                                       
ఎన్టీఆర్‌,సురేంద్రరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఊసరవెల్లి’. కమర్షియల్‌గా సొమ్ములు రాబట్టిన ఉసరవెల్లి చిత్రం ఇప్పుడు బెంగాలీలో రీమేక్‌ అవుతోంది. మిధున్‌ చక్రవర్తి కుమారుడు మిమో ఈ చిత్రంలో  read more

భారత్‌పై న్యూజిలాండ్ విజయం:సిరీస్ కైవసం

       New Zealand's Brendon McCullum and teammate Kane Williamson run between the wickets during their second Twenty20 cricket match against India in Chennai
చెన్నయ్‌లో మంగళవారం అత్యంత ఉత్కంఠంగా జరిగిన రెండవ టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతే భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్రెండన్ మెకల్లమ్ అద్భుత ఆటతీరుతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. తొలి రెండు వికెట్లను 2 పరుగులకే కోల్పోయిన న్యూజిలాండ్‌ను బ్రెండన్ మెకల్లమ్ విలియమ్‌సన్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకున్నారు.read more

Monday, September 10, 2012

కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్

నిజానికి వైఎస్ తదనంతరం పలు సందర్భాల్లో కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోవడం, కాంగ్రెస్‌ను బాబు పలువిధాలుగా ఆదుకుంటూ వస్తుండటం బహిరంగ రహస్యమే. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బాబు ససేమిరా అనడం తెలిసిందే. ఆ సందర్భంలోనే ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో ఫోన్లో మాట్లాడారని, రాష్ట్ర సర్కారుకు ఢోకా ఉండదని, ముఖ్యంగా తన వల్ల ఎలాంటి సమస్యా ఉండదని భరోసా ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోదని బాబు హామీ ఇచ్చారని, ఆయన నుంచి ఈ రకమైన మద్దతు చూసి విస్మయానికి లోనైన పటేల్, ‘అవసరమైనప్పుడు మీ మద్దతు తప్పక తీసుకుంటాం’ అని చెప్పారని ఢిల్లీ వర్గాల్లో విన్పించింది. 
అందుకు తగ్గట్టే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ బలం పెరిగాక మాత్రమే బాబు అవిశ్వాసం పెట్టి మమ అన్పించారు. అంతేగాక.. ‘ఇకపై అవిశ్వాసం పెట్టబోం’ అంటూ కరాఖండిగా ప్రకటన కూడా చేశారు! 2011 ఆగస్టులో రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా బాబు ఒక రాత్రి ఎస్పీజీ, పోలీసు భద్రత లేకుండా ఒక ఎంపీ, తన వ్యక్తిగత భద్రతాధికారితో కలిసి ప్రైవేటు వాహనంలో వెళ్లి మరీ కేంద్రంలోని ఓ కీలక మంత్రితో మంతనాలు జరిపారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎమ్మార్ కుంభకోణం నుంచి సాంత్వన చేకూర్చాల్సిందిగా ఆయన్ను బాబు కోరారని కూడా చెప్పుకున్నారు. బాబు గానీ, టీడీపీ గానీ వాటిని ఖండించలేదు కూడా. ‘బాబు వచ్చి నన్ను కలిశారు’ అంటూ కొంతకాలానికే అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం సాక్షాత్తూ లోక్‌సభలోనే ప్రకటించారు! ఇలా వైఎస్ మరణానంతరం రెండున్నరేళ్లుగా అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న బాబు.. తాజాగా ప్రధాని భేటీలో కూడా ఏదో ‘కీలకాంశం’పైనే చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

కత్తిలాంటి కైఫ్

                                          
ఇప్పటికే ప్రపంచమంతా నెం.1 శృంగార దేవతగా ఆరాధిస్తున్న కత్రినాకైఫ్‌కు గ్లామర్ మరింత పెంచుకోవాలన్న ఆలోచన వచ్చిందట. ధూమ్-3 చిత్రంలో కొత్త కత్రినాను చూస్తారని చెబుతోంది. ఇప్పటినుంచే అనేక విధాలుగా శరీర కొలతలు మార్చుకునే పనిలో పడిందట. అందరూ తింటున్నట్లుగా తినకుండా పండ్లు, కూరగాయలతోనే లంచ్, డిన్నర్‌లు ముగిస్తోందట. అత్యంత సెక్సీగా కనిపించేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నం ఫలించి, సరికొత్త కత్రినా కనిపిస్తోందని చూసినవాళ్లు చెబుతున్నారు. తాను చేస్తున్న కోర్సు ముగిసేలోపు తన తోటి హీరోయిన్లు కళ్లుకుట్టుకునేలా ఆమె కనిపించనుందట. ఈ విషయాన్ని కత్రినానే ప్రకటించింది. త్వరలో సరికొత్త ఫొటోగ్రాఫ్‌లతో కనిపించి ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తానంటోంది. చూద్దాం.. కొత్త కత్రినా కత్తిలా వుంటుందో లేదో!

నాగార్జున‘శిరిడీ సాయి’యాత్రలు

                                 
సాయి భక్తితత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘శిరిడీ సాయి’ చిత్రం సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మితమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ యాత్రలు నేటినుండి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రేక్షకులు సాయి చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటం దృష్ట్యా వారందరినీ కలుసుకోవాలని ఈ యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలోread more

Sunday, September 9, 2012

పక్కింటోళ్ల కోసమే పెళ్లి చేసుకొంటా!


రెండు రోజుల క్రితం విడుదలైన ‘జులాయి’ యావరేజ్‌ అనిపించుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఇలియానా పెద్ద మైనస్‌ అనే చర్చ జనాల్లో నడుస్తోంది.ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య పెద్దగా కెమిస్ట్రీ పండలేదని టాక్‌. సినిమాలో ఒకానొక సందర్భంలో హీరోయిన్‌ను ఉద్దేశించి అలీ ఇలా అంటాడు ‘కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్‌ అంబాసిడర్‌’లా ఉన్నా వని. ఆ మాటను నిజం చేస్తూ ఇలియానా పూర్తిగా పేషెంట్‌ మాదిరిగా ఉంది.read more

నా యాత్రకో పేరు కావాలి:చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టదలచిన పాదయాత్రకు ఓ పేరుNaidu to do a YSR with a 122-km yatraకావాలట. అక్టోబర్ రెండు నుంచి జనవరి 26 వరకు జరిగే పాదయాత్రకు పేరు సూచించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. ప్రజా యాత్ర, ప్రజాహిత యాత్ర వంటి పేర్లు నేతలు అప్పటికప్పుడు బాబుకు సూచించారు. పేరుతో పాటు పలు పేర్లను నాయకులు సూచించారు. read more

నిజాయితీగల నాయకులనే ఎన్నుకోవాలి…అన్నా హజారే

                                           
ప్రజాసేవ, వ్యక్తిత్వం ఆధారంగానే నాయకులను ఎన్నుకోవాలని సామాజిక వేత్త అన్నా హజారే ప్రజలను కోరారు. తాను ఎన్నికల్లో పాల్గొనబోనని, నిజాయితీగల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. నాయకులు తమ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. తాము చేసే ప్రతి పనికి ప్రజలకు జవాబు చెప్పగలగాలని ఆయన అన్నారు. తమ స్వంత గ్రామమైన రాలేగాలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాయితీ కలిగిన నాయకులు పార్లమెంటులో చాలా తక్కువమంది ఉన్నారన్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందడం కష్టమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన్ను అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోదియా, దినేష్‌ వాఘేలా కలిసారు. వివిధ అంశాలపై చర్చించారు.

రాఘవేంద్రరావు తనయుడు దర్శకత్వంలో బాలయ్య100వ చిత్రం

ఏ నటుడి సినీ జీవితంలోనైనా వందవ చిత్రమనేది ఓ మైలురాయిలా నిలిచిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. త్వరలో వందవ చిత్రానికి చేరువవుతున్న నందమూరి బాలకృష్ణ కూడా తన చిత్రాన్ని అలాంటి రీతిలోనూ ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, విభిన్న కథాంశంతో...read more

Saturday, September 8, 2012

కార్మికుల ప్రాణాలంటే లెక్కలేదా?


                     
ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్యాల అక్రమాలు, అధికారుల అవినీతి పెనవేసుకుపోయి పరిశ్రమల్లో ప్రమాదాలను ఆనవాయితీగా మార్చేశాయి. స్వాతంత్య్రదినం రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో స్టీమ్‌కోర్‌ అలైస్‌లో సంభవించిన ఘోర ప్రమాదం యావత్‌ రాష్ట్రాన్ని, కార్మిక లోకాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో సలసల కాగుతున్న ఇనుప ద్రవం ఒంటి మీద పడి ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. మరో పది మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అదే రోజు హైదరాబాద్‌ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారత్‌ ఫ్లెక్సోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఎన్‌పి కెమికల్స్‌, కార్మోల్‌ డ్రగ్స్‌లో ప్రమాదాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగార్జున అగ్రికెమ్‌లో జరిగిన భారీ పేలుడు సంచలనం కలిగించింది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి 40 గ్రామాల ప్రజల జీవనం ప్రశ్నార్థకమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల చిట్టా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు, క్షతగాత్రులు కేవలం రెక్కల కష్టాన్ని, శారీరక శ్రమను నమ్ముకున్న వారే. పొట్ట చేత పట్టుకుని పనుల కోసం జిల్లాలు, రాష్ట్రాలు దాటి వస్తున్న నిరు పేదలు. వీరు చనిపోతే మృతుల వివరాలు సైతం బయటికి రావు. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించరు. ఎక్స్‌గ్రేషియా, పరిహారం వంటివి వారి దరి చేరవు. షాద్‌నగర్‌ ప్రమాదంలో మృతులు, గాయపపడ్డవారిలో ఎక్కువ మంది యుపి, బీహార్‌కు చెందిన వారే ఉండటం కార్మికుల దీన స్థితికి నిదర్శనం.
ప్రైవేటు యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ప్రభుత్వం బాధ్యతా రహితంగా చేతులు కట్టుకు కూర్చుంది. చాలా ఫ్యాక్టరీలకు కావాల్సిన అనుమతుల్లేవు. ప్రమాదాలను నివారించే, అప్రమత్తం చేసే చర్యలు శూన్యం. అగ్ని నిరోధక సాధనాలు నామమాత్రం. మాక్‌ డ్రిల్‌ ఊసే లేదు. కాలుష్య నియంత్రణ మండలి చోద్యం చూస్తోంది. ఫ్యాక్టరీలను తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగట్లేదు. ఫ్యాక్టరీ, కార్మిక, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక, తదితర ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అధికారుల అవినీతిలో యాజమాన్యాల అక్రమాలు కొట్టుకుపోతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అందాల్సిన సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. దీని వల్ల సకాలంలో వైద్యం అందక కార్మికులు చనిపోతున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం, వైద్యం, తదితర సౌకర్యాలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం ఎప్పుడూ మీనమేషాలే లెక్కిస్తోంది. చాలా సందర్భాల్లో యాజమాన్యాల కొమ్ముకాస్తోంది. ప్రమాదాలపై సకాలంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తే ఘోరాలు ఆగుతాయి. ప్రమాదాల నివారణకు పని ప్రదేశాల్లో ముందస్తు చర్యలు చేపడితే కార్మికుల ప్రాణాలను కాపాడే వీలుంది. ప్రభుత్వం అటువంటి చర్యలపై ఉదాసీనంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఆ వేడిలో హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకోనందువల్లనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏడాది క్రితం షాద్‌నగర్‌ మండలం కొత్తూరు వద్ద గల వినాయక స్టీల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పటి ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారిస్తున్న జైన్‌ కమిటీ డిజైన్‌, నాణ్యతా లోపాలను వదిలిపెట్టి ఉద్యోగులదే తప్పన్నట్లు చిత్రీకరిస్తోంది. సింగరేణిలోనూ పరిస్థితి ఇలానే ఉంది.

చంద్రబాబు పాదయాత్రకు అంతా సిద్ధం

                        
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ఏ పేరు అయితే బాగుంటుందోనని సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు. ప్రజా హితం లేదా జన హితం అనే పేరు పెడితే బాగుంటుందని కొందరు నాయకులు సూచించినట్టు తెలుస్తున్నది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినా, రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన ఈ దారుణ పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమం కాబట్టి ప్రజా హితం గాని లేదా జన హితం గాని బాగుంటుందని పెక్కుమంది అభిప్రాయపడుతున్నారు.

20 ఏళ్లకే 22 మంది పిల్లలు!

                                                          
నిజంగా హన్సిక చాలా గ్రేట్! పెద్ద పెద్ద మెగాస్టార్లు, స్టార్ హీరోయిన్లు, బడా నిర్మాతలు చేయలేని పనిని చాలా సింపుల్ గా చేసి చూపుతోంది ఈ అమ్మాయి. 20 ఏళ్ల వయసులోనే తన సేవా దృక్పథంలో 22 మంది చిన్నారులకు చ్చింది.read more

Friday, September 7, 2012

'శ్రీదేవి' ప్రత్యామ్నాయంగా తమన్నా!

80లలో జితేంద్ర యాంగ్రీ యంగ్ మ్యాన్ గా వెలుగొందుతున్న రోజుల్లో అతడి సూపర్ హిట్ సినిమా 'హిమ్మత్ వాలా' ఈ సినిమా అప్పట్లో బీభత్సమైన మాస్ హిట్. ఇదే సినిమా టైమ్ లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో వెలుగొందుతున్న హీరోయిన్ 'శ్రీదేవి'. హిమ్మత్ వాలా సాహసాలకు తోడు,read more

వైఎస్‌ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ

పాదయాత్ర అనుభవాలతో కూడిన వైఎస్‌ పాదయాత్ర డైరీని వైఎస్‌ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు చేతుల మీదుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరా ఆవిష్కరించారు. కొన్ని అంశాలతో కూడిన డైరీని read more

Thursday, September 6, 2012

‘ సుడిగాడు ‘చూసిన రజనీకాంత్‌

అల్లరి నరేష్‌ నటించిన సుడిగాడు సాధించిన ఘన విజయం తమిళనాడుకు పాకింది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సుడిగాడుని చూసేలా చేసింది.సుడిగాడును చూసేం దుకు చెన్నైలో ఏర్పాట్లు చేయాలని చిత్ర దర్శక నిర్మాతలను ఆయన కోరటంread more

Wednesday, September 5, 2012

కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ !


 రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ రానుందా.. అంటే అవుననిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించేందుకు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. ఇందుకు సంబంధించి ముంబైకి చెందిన ఓ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవ త్సరాల, 4 నెలలు పూర్తి అయింది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకువెళ్ళాలంటే తమకంటూ ప్రత్యేక ఛా నెల్‌ ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఛానెల్స్‌ ద్వారా పార్టీ కార్య క్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం సాధ్యం కా దు గనుక, రాష్ట్ర కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసు కుందని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో మంత్రు లు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తమ నియోజ కవర్గాల పరిధిలో చేస్తున్న కార్యక్రమాలను ఈ ఛానెల్‌ ద్వారా ప్రజలకు వివరిం చవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల మూసివేసిన ఓ ఛానెల్‌లో భాగస్వామి అయి, తద్వారా ఛానెల్‌ను పేరుమార్చకుండా యధావి ధిగా నిర్వహించాలని బొత్స ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రంగంలో అనుభవం ఉన్న బొత్సకు ఈ ఛానెల్‌ నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఇదిలాఉంటే గతంలో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడి ద్వారా సాక్షి దినపత్రిక, సాక్షి ఛానెల్‌ను ప్రారం భించినప్పటికీ, వైఎస్‌ మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ప్రత్యేక ఛానెల్‌ అంటూ లేకపోయింది. సీపీఎం తమ పార్టీ తరపున మరో రెండు నెలల్లో ఛానెల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇదిలాఉంటే సీపీఐ కూడా తమకూ ఓ ప్రత్యేక ఛానెల్‌ ఉండాలని యోచిస్తుంది.

ఇదే బాటలో పయనించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీగా ఉండి, ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉండికూడా ఏ రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేక ఛానెల్‌ లేకపోవడం కాంగ్రెస్‌కు కొంత వెలితిగా ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేరళలో పీసీసీకి ప్రత్యేక ఛానెల్‌ ఉందని, మన రాష్ట్రంలోకూడా ఉండాలని పార్టీ వర్గాలు కోరుతు న్నాయి. మంగళవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరో కొద్దినెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభు త్వం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. ఈ తరు ణంలో ఛానెల్‌ను ప్రారంభిస్తే స్థాని క సంస్థల ఎన్ని కలకు ముందే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మ రింత పటి ష్ఠంగా తీసుకెళ్ళవచ్చని పార్టీ వర్గాలు అంటు న్నాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు... సబ్సీడీమీద విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రూ.లక్ష వరకు వడ్డీ లేకుండా రుణాలు అందజేయడం వంటి పథకాలను సంక్షిప్త కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయాలని పార్టీ యోచిస్తుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా రెండు జతల యూనిఫారాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, వీటితోపాటు కంప్యూటర్‌ విద్య, ముస్లిం విద్యార్థినులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తే, పార్టీ గ్రామస్థాయిలో పటిష్ఠం అవుతుందని పార్టీవర్గాలు అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సహకార, మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స జిల్లాల్లో విరివిగా పర్యటిస్తుంటారు. ఆయా సందర్భాల్లో ఆక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పొల్లుపోకుండా ప్రజలకు చూపిస్తే, ప్రభుత్వం, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యా నిస్తున్నాయి.

Tuesday, September 4, 2012

అక్టోబర్‌ 11న ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’

 పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.  చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి.దానయ్యను వెల్లడించారు. ‘పవన్‌కళ్యాణ్‌ గారు పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన అభినయం హైలైట్‌గా ఉంటుంది. పూరి జగన్నాథ్‌గారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో, సూపర్‌సాంగ్స్‌తో, థ్రిల్లింగ్‌ యాక్షన్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రూపొందుతోంది. ఈ నెల 31తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌ రెండు పాటలు చిత్రీకరించడంతో, ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్‌లో, పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఇది ఓ బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది.

Monday, September 3, 2012

'శ్రీమన్నారాయణ' సక్సెస్‌మీట్‌

నందమూరి బాలకృష్ణ సినిమాఅంటే అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంబినేషన్‌లో విషయంకూడా అందులో ఉంటుంది. ఇటీవలే విడుదలైన 'శ్రీమన్నారాయణ' సినిమా గురించి ఆయన తన మనసులోని మాటను ఆవిష్కరించారు. ఈప్రాజెక్ట్‌ ఎనౌన్స్‌మెంట్‌ నుంచి విచిత్రమైన కాంబినేషన్‌ అనుకున్నారు. అదే విషయాన్ని బాలకృష్ణ చెప్పారు. ''రవి చావలి నన్ను కలవడానికి పడిన శ్రమను గుర్తించాను. ఓ సందర్భంలో కలిశారు. కథ చెప్పారు. ఆయన చెప్పిన విధానం, ఆయనపై నమ్మకం కల్గింది. దీనికితోడు ఘటికాచలం డైలాగ్స్‌ ఎలా ఉంటాయనే అనుకున్నారు. ఈయన బాలకృష్ణ సినిమాకు రాయగలుగుతాడా? లేదా? అని చాలామందిలో కలిగింది. ఆయన ఈ సినిమాలో గంభీరమైన డైలాగ్స్‌ రాశరు. కొత్త కాంబినేషన్‌. కానీ టాలెంట్‌ ఎక్కడ ఉంటే వారిని ప్రోత్సహించాలని శ్రీమన్నారాయణ సినిమా చేశాను'' అంటూ బాలకృష్ణ వెల్లడించారు. ఆదివారం రాత్రి శ్రీమన్నారాయణ సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ కలిసి కష్టపడిపనిచేశారు. హీరోయిన్లు బాగా నటించారు.. అంటూ... 'చలాకీ చూపుల్తో ఛూ మంత్రం వేశావే...' అంటూ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చిన చక్రి సింహా తర్వాత ఈ చిత్రానికి పని చేశాడని అన్నారు

Saturday, September 1, 2012

బంగారం ధర రోజురోజుకు సరికొత్త రికార్డు

బంగారం రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు దూసుకుపోవటంతో పాటు దేశీయంగా స్టాకిస్టులు భారీగా కొనుగోళ్లకు దిగటంతో శనివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరలు 550 రూపాయలు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 31,725 రూపాయలను తాకాయి. ఢిల్లీ బాటలోనే ముంబైలో కూడా 10 గ్రాముల బంగారం ధరలు 520 రూపాయలు పెరిగి 31,400 రూపాయలకు చేరుకోగా కోల్‌కతా, చెన్నైల్లో 540 రూపాయలు వృద్ధి చెంది వరుసగా 31,715 రూపాయలు, 31,575 రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా సాగింది. ఢిల్లీలో కిలో వెండి 2,250 రూపాయలు పెరిగి 59,500 రూపాయల వద్ద స్థిరపడగా ముంబైలో 2,000 రూపాయలు వృద్ధి చెంది 59,200 రూపాయల వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగటంతో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకాయని ట్రేడర్లు తెలిపారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ ఆర్ధిక వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధరలు ఐదు నెలల గరిష్ఠ స్థాయిలకు చేరుకోగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు స్పెయిన్ ప్రభుత్వం ఆమోదం తెలపటం ధరలు పెరగటానికి దోహదపడింది.