http://apvarthalu.com/

Thursday, September 20, 2012

రాష్ట్రంలో పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి


డీ జిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పెంచిన ధరలు తగ్గించాలని డిమాంద్ చేస్తూ విపక్షాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. బంద్‌కు మద్దతు తెలుపుతూ విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న విపక్షాల నేతలు, కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులను నిలిపివేశారు.
* హైదరాబాద్ : బంద్ సందర్భంగా ఎంజీబీఎస్ బస్‌స్టాండ్ ఎదుట వాపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం సీపీఐ నేత నారాయణ సహా, టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* విశాఖపట్నం : మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు.
* విజయనగరం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
* మహబూబ్‌నగర్ : జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* చిత్తూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* విజయవాడ : నగరంలోని బస్టాండ్ దగ్గర విపక్షాలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఏలూరు రోడ్డులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. సీపీఎం నేత బాబూరావు సహా, పలువురిని అరెస్ట్ చేవారు.
* కృష్ణా జిల్లా : జిల్లాలోని కైకలూరులో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రభుత్వ, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* వరంగల్ : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్ష నేతలు ఆందోలనలకు దిగాయి. హన్మకొండ, పరకాల బస్టాండ్ దగ్గర టీడీపీ, బీజేపీ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* మెదక్ : జిల్లాలో వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
* ఖమ్మం : జిల్లాలోని ఆరు డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వైరా రోడ్డులోని పెట్రోల్ బంక్‌పై ఆందోళకారులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
* నల్గొండ : బంద్ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు బైఠాయించి నిరసన చేశారు.

No comments: