http://apvarthalu.com/

Saturday, September 29, 2012

హైదరాబాద్ గణనాథునికి ఘన వీడ్కోలు

 హైదరాబాద్ నగరం భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తజనం నామస్మరణ. ఒకవైపు చిరుజల్లులతో మొదలైన వర్షం జోరుగా కురిసినా.. భక్తకోటి ఉత్సాహాన్ని అది అడ్డుకోలేకపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి భక్తులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చ రిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రాత్రి ఒంటిగంట లోపే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయింది. రాత్రి 11 గంటల సమయానికి 4,350 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12-1 మధ్య మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, కూకట్‌పల్లి, ఐడీపీఎల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన పర్వం కొనసాగింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేశ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అత్తాపూర్‌లో హైటెన్షన్ తీగలకు జెండా తగిలి విద్యుదాఘాతంతో ఆరుగురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా జరిగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకుంది.

No comments: