http://apvarthalu.com/

Thursday, September 13, 2012

చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ. 35.59 కోట్లు

                                                 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను గురువారం ప్రకటించారు. ప్రతిఏటా తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని అన్నారు. తాను ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రి వర్గంలో చలనం వచ్చిందన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయందని, దేశం బాగుపడాలంటే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తన నివాసం నుంచి గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కామన్వెల్త్, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం, అలాగే రాష్ట్రంలో ఓఎంసీ, స్టాంపుల కుంభకోణం ఇలాంటి అవినీతిపై తాము పోరాటం చేస్తుంటే ఎదురుదాడి చేసి నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు. అటు కేంద్రంలో కూడా ఇదే పరిస్థితిలో ఉందని చంద్రబాబు విమర్శించారు.

కొందరు నేతలు రాజకీయాలను స్వార్ధం కోసం వాడుకుని కోట్ల రూపాయలు కూడబెదుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమలాగే మిగతా రాజకీయనాయకులు వారి ఆస్తులను ప్రకటించాలని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పార్టీ పెట్టి పరపతిని కోల్పోయారని అన్నారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబు అవినీతిపై పోరాటం చేస్తునే ఉన్నారని అన్నారు.

భువనేశ్వరి (చంద్రబాబు సతీమణి) నిర్వహిస్తున్న వ్యాపారాలకు ఎక్కడా ప్రభుత్వ భూమి కానీ ఇతర లబ్ది కానీ పొందలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు ఎకరాలు, రెండువేల కోట్ల రూపాయలు అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. సింగపూర్‌లో హోటల్స్ ఉన్నాయని చెప్పిన వారు నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు.

ఆస్తుల వివరాలు :
తమ కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ : రూ. 35.59 కోట్లు
చంద్రబాబు పేరున ఉన్న ఆస్తి : రూ. 31.97 లక్షలు
1985 నుంచి 1992 మధ్యలో నిర్మించిన ఇల్లు, కారు చంద్రబాబు పేరుమీద ఉన్నాయి.
భువనేశ్వరి పేరుమీద ఉన్న ఆస్తుల విలువ : రూ. 24.57 కోట్లు.
కుమారుడు లోక్‌ష్ పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 6.62 కోట్లు
కోడలు బ్రహ్మణి పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 2.09 కోట్లు.
అలాగే అప్పులు కూడా ఉన్నాయని భువనేశ్వరి పేరు మీద అప్పులు : రూ. 12.38 కోట్లు, లోకేష్ నాయుడు పేరు మీద : రూ. 9 లక్షలు అప్పులు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

No comments: