http://apvarthalu.com/

Wednesday, September 26, 2012

సీఎంని గొర్రెల కాపరితో పోల్చిన లగడపాటి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపి లగడపాటి రాజగోపాల్ గొర్రెల కాపరితో పోల్చారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి 9 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఒకప్పుడు గొర్రెల కాపరి అని తెలిపారు. గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి సక్రమంగా నడిపించారన్నారు. సీఎం కిరణ్ కూడా అలాగే మన రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తారన్నారు.

No comments: