http://apvarthalu.com/

Tuesday, September 4, 2012

అక్టోబర్‌ 11న ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’

 పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.  చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి.దానయ్యను వెల్లడించారు. ‘పవన్‌కళ్యాణ్‌ గారు పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన అభినయం హైలైట్‌గా ఉంటుంది. పూరి జగన్నాథ్‌గారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో, సూపర్‌సాంగ్స్‌తో, థ్రిల్లింగ్‌ యాక్షన్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రూపొందుతోంది. ఈ నెల 31తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌ రెండు పాటలు చిత్రీకరించడంతో, ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్‌లో, పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఇది ఓ బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది.

No comments: