http://apvarthalu.com/

Sunday, September 9, 2012

నిజాయితీగల నాయకులనే ఎన్నుకోవాలి…అన్నా హజారే

                                           
ప్రజాసేవ, వ్యక్తిత్వం ఆధారంగానే నాయకులను ఎన్నుకోవాలని సామాజిక వేత్త అన్నా హజారే ప్రజలను కోరారు. తాను ఎన్నికల్లో పాల్గొనబోనని, నిజాయితీగల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. నాయకులు తమ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. తాము చేసే ప్రతి పనికి ప్రజలకు జవాబు చెప్పగలగాలని ఆయన అన్నారు. తమ స్వంత గ్రామమైన రాలేగాలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాయితీ కలిగిన నాయకులు పార్లమెంటులో చాలా తక్కువమంది ఉన్నారన్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందడం కష్టమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన్ను అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోదియా, దినేష్‌ వాఘేలా కలిసారు. వివిధ అంశాలపై చర్చించారు.

No comments: