http://apvarthalu.com/

Thursday, September 20, 2012

సింహవాహనంపై మురిపించిన శ్రీనివాసుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామి సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం స్వామివారి ఉత్సవర్లయిన మలయప్పకు విశేష సమర్పణ గావించారు. అనంతరం స్వామివారు వాహనమండపానికి వేంచేశారు. అక్కడ వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి సింహవాహనాన్ని అధిరోహించారు. మృగరాజైన సింహాన్ని లోబరుచుకుని వాహనం చేసుకున్న ఆనందంతో యోగముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీ«ధులలో రెండు గంటలపాటు సాగిన స్వామివారి ఊరేగింపు భక్తులను తన్మయులను చేసింది. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామికి, దేవేరులు శ్రీదేవి,భూదేవిలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. ఉత్సవర్లకు విశేష సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

No comments: