http://apvarthalu.com/

Tuesday, January 22, 2013

ఢిల్లీలో సీమాంధ్ర-తెలంగాణ నేతల పోటాపోటీ భేటీ

దేశ రాజధాని ఢిల్లీ విభజన రాజకీయాలతో వేడెక్కింది. సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోటాపోటీగా అధిష్టానం పెద్దలను కలిసి తమ వాదనలు వినిపిస్తున్నారు.మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఎంపీ కేవీపీ, మంత్రులు శైలజానాథ్, టీజీ వెంకటేష్, ఏరాసు, కాసు, గాదె, ఏపీ ఎన్జీవో నేతలు భేటీ అయిన వారిలో ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ప్రధానికి నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర వ్యవహారా ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో నేతలు భేటీ అయి తమ వాదనను వినిపించారు.ఇదే సమయంలో అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయి తెలంగాణ వాదాన్ని వినిపించారు. మరికొందరు అధిష్టానం పెద్దలను ఇరు ప్రాంతాల నేతలు కలవనున్నారు.

No comments: