http://apvarthalu.com/

Sunday, January 20, 2013

తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు...కోదండరామ్

సీమాంధ్ర నేతలు పెత్తనాన్ని కొనసాగించేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి తెలంగాణ రాకుండా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది కేంద్ర అధిష్టానానికి, కాంగ్రెస్ కు పరీక్షా కాలమని కోదండరామ్ అన్నారు. ప్రలోభాలకు లొంగుతారో, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయం న్యాయసమ్మతంగా ఉంటే పోలీసు బలగాల అవసరం లేదని కోదండరామ్ అన్నారు. తెలంగాణకు అనుకూల ప్రకటన రాకుంటే భారీ ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

No comments: