http://apvarthalu.com/

Wednesday, October 3, 2012

కేసీఆర్ పై హైకోర్టు విచారణ

ప్రభుత్వం కేటాయించిన భూమిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నరని ఆయన మేనల్లుడు ఉమేష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉమేష్ రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ప్రభుత్వం నుండి తీసుకున్న భూమిలో నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంతో ప్రైవేటు న్యూస్ ఛానల్ ను నడపడంపై ఉమేష్ రావు గతంలో కేసీఆర్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

No comments: