http://apvarthalu.com/

Friday, October 12, 2012

ఏపీ విభజన సాధ్యం కాదు...గులాం నబీ ఆజాద్‌

 తెలంగాణ అంశాన్ని తేల్చడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌, బీహార్‌, యూపీలను విభజించినట్లుగా ఏపీ విభజన సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ అంశంపై రెండేళ్లుగా వివిధస్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆజాద్ తెలిపారు. కేసీఆర్‌తోనూ సంప్రదింపులు జరిపామని ఆజాద్‌ ధృవీకరించారు. అయితే తెలంగాణపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని.. ఆ తర్వాతే కేంద్ర ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆజాద్ పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

No comments: