http://apvarthalu.com/

Sunday, October 7, 2012

తిరుమలలో శ్రీవారి లడ్డూల కొరత

 తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కొరత ఏర్పడింది. దీంతో అదనపు లడ్డూ టోకన్లను టీటీడీ కుదించింది. వారం రోజులుగా తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీకి తగట్టుగా లడ్డూ ప్రసాదాలను అందించారు. రోజువారి తయారీతో పోలిస్తే భక్తులకు పంపిణీ చేసిన లడ్డూలే అధికంగా ఉంది. దీంతో ఆలయ పోటులో నిల్వ ఉంచిన లడ్డూలను సైతం భక్తులకు అందించడంతో అయిపోయాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా తయారైన లడ్డూలు నేరుగా కౌంటర్లకు తరలించి తడిగా ఉన్న ప్రసాదాలనే భక్తులకు అందజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల లడ్డూలు నిల్వ ఉంచడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. దీంతో భక్తులకు అదనంగా జారీచేసే లడ్డూపడి టిక్కెట్లను కుదించారు. ఆదివారం ఉదయం నుంచి ఒకరికి నాలుగు లడ్డూల స్థానంలో రెండింటినే జారీ చేస్తున్నారు. దీనిపై కొందరు భక్తులు కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లడ్డూ కౌంటర్ల ప్రాంతానికి చేరుకుని భక్తులకు సమస్యను వివరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ లడ్డూ టోకన్ల కుదింపు విషయాన్ని ముందుగానే మైకుల ద్వారా, కౌంటర్ వద్ద సిబ్బందిచే భక్తులకు తెలియజేసి ఉంటే వ్యతిరేకత ఎదురయ్యేది కాదు.

No comments: