http://apvarthalu.com/

Monday, December 3, 2012

1000 కి.మీ పూర్తి చేసుకొన్న…వస్తున్నా…మీకోసం


సోమవారం ఉదయం జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండ పంటక్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు పెంటాఖుర్దులో 1000 కి.మీ మైలు రాయిని దాటారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపై మొదటి సంతకం, బెల్లు షాపుల రద్దుపై రెండో సంతకం ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ జిల్లాలో నిజాంసాగర్, మంజీరా ఉన్నా మంచినీళ్లకు తీవ్ర కొరత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ‘మంచినీళ్లు నిల్, మద్యం ఫుల్’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర మంచినీటి పథకాలు పెట్టి అన్ని గ్రామాలు, తండాలకు ఎన్టీఆర్ సృజల అనే కార్యక్రమంతో మంచినీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇవ్వదలిచామని ఆయన తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు ఉన్నా న్యాయం జరగలేదన్నారు.red more

No comments: