http://apvarthalu.com/

Wednesday, September 26, 2012

తెలంగాణ ఎక్కడ ఉందో 30న తెలుస్తుంది

 తెలంగాణ ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 30న ప్రజలు చూపిస్తారని బిజెపి ఎంపి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మోసపోతారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100రోజులలోనే తెలంగాణ ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో పోలీసులకు ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు

రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. జీవవైవిద్య సదస్సుకు వచ్చే వీవీఐపీలకు హైసెక్యూరిటీ కల్పించాలని తెలిపింది. విదేశీ ప్రతినిధులకు ఒక్కొక్కరికీ బాడీగార్డులను నియామకం జరగనుంది. ఉగ్రవాదులు, ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై పోలీసులకు ఐబీ సూచనలు జారీ చేసింది.

సీఎంని గొర్రెల కాపరితో పోల్చిన లగడపాటి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపి లగడపాటి రాజగోపాల్ గొర్రెల కాపరితో పోల్చారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి 9 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఒకప్పుడు గొర్రెల కాపరి అని తెలిపారు. గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి సక్రమంగా నడిపించారన్నారు. సీఎం కిరణ్ కూడా అలాగే మన రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తారన్నారు.

Friday, September 21, 2012

అల్లు అర్జున్ సరసన కాజల్ లవ్ స్టోరీ


                                  
రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్య 2 చిత్రంలో ఈ జంట రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఈ జంట మద్య లవ్ స్టోరీని బాగా పండించటానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ పదిహేను నిముషాలు పాటు ఉంటుందని అంటున్నారు. ఓ పాట, రెండు ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆ లవ్ స్టోరీ చాలా స్పీట్ గా నడిపి కథకు కీలకంగా మార్చనున్నారని తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకునే సినిమా మొత్తం నడుస్తుందంటున్నారు.

Thursday, September 20, 2012

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా...శేఖర్ కమ్ముల


దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...‘నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.

సింహవాహనంపై మురిపించిన శ్రీనివాసుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామి సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం స్వామివారి ఉత్సవర్లయిన మలయప్పకు విశేష సమర్పణ గావించారు. అనంతరం స్వామివారు వాహనమండపానికి వేంచేశారు. అక్కడ వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి సింహవాహనాన్ని అధిరోహించారు. మృగరాజైన సింహాన్ని లోబరుచుకుని వాహనం చేసుకున్న ఆనందంతో యోగముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీ«ధులలో రెండు గంటలపాటు సాగిన స్వామివారి ఊరేగింపు భక్తులను తన్మయులను చేసింది. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామికి, దేవేరులు శ్రీదేవి,భూదేవిలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. ఉత్సవర్లకు విశేష సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రాష్ట్రంలో పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి


డీ జిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పెంచిన ధరలు తగ్గించాలని డిమాంద్ చేస్తూ విపక్షాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. బంద్‌కు మద్దతు తెలుపుతూ విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న విపక్షాల నేతలు, కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులను నిలిపివేశారు.
* హైదరాబాద్ : బంద్ సందర్భంగా ఎంజీబీఎస్ బస్‌స్టాండ్ ఎదుట వాపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం సీపీఐ నేత నారాయణ సహా, టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* విశాఖపట్నం : మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు.
* విజయనగరం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
* మహబూబ్‌నగర్ : జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* చిత్తూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* విజయవాడ : నగరంలోని బస్టాండ్ దగ్గర విపక్షాలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఏలూరు రోడ్డులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. సీపీఎం నేత బాబూరావు సహా, పలువురిని అరెస్ట్ చేవారు.
* కృష్ణా జిల్లా : జిల్లాలోని కైకలూరులో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రభుత్వ, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* వరంగల్ : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్ష నేతలు ఆందోలనలకు దిగాయి. హన్మకొండ, పరకాల బస్టాండ్ దగ్గర టీడీపీ, బీజేపీ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* మెదక్ : జిల్లాలో వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
* ఖమ్మం : జిల్లాలోని ఆరు డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వైరా రోడ్డులోని పెట్రోల్ బంక్‌పై ఆందోళకారులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
* నల్గొండ : బంద్ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు బైఠాయించి నిరసన చేశారు.