http://apvarthalu.com/

Sunday, September 9, 2012

నా యాత్రకో పేరు కావాలి:చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టదలచిన పాదయాత్రకు ఓ పేరుNaidu to do a YSR with a 122-km yatraకావాలట. అక్టోబర్ రెండు నుంచి జనవరి 26 వరకు జరిగే పాదయాత్రకు పేరు సూచించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. ప్రజా యాత్ర, ప్రజాహిత యాత్ర వంటి పేర్లు నేతలు అప్పటికప్పుడు బాబుకు సూచించారు. పేరుతో పాటు పలు పేర్లను నాయకులు సూచించారు. read more

నిజాయితీగల నాయకులనే ఎన్నుకోవాలి…అన్నా హజారే

                                           
ప్రజాసేవ, వ్యక్తిత్వం ఆధారంగానే నాయకులను ఎన్నుకోవాలని సామాజిక వేత్త అన్నా హజారే ప్రజలను కోరారు. తాను ఎన్నికల్లో పాల్గొనబోనని, నిజాయితీగల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. నాయకులు తమ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. తాము చేసే ప్రతి పనికి ప్రజలకు జవాబు చెప్పగలగాలని ఆయన అన్నారు. తమ స్వంత గ్రామమైన రాలేగాలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాయితీ కలిగిన నాయకులు పార్లమెంటులో చాలా తక్కువమంది ఉన్నారన్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందడం కష్టమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన్ను అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోదియా, దినేష్‌ వాఘేలా కలిసారు. వివిధ అంశాలపై చర్చించారు.

రాఘవేంద్రరావు తనయుడు దర్శకత్వంలో బాలయ్య100వ చిత్రం

ఏ నటుడి సినీ జీవితంలోనైనా వందవ చిత్రమనేది ఓ మైలురాయిలా నిలిచిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. త్వరలో వందవ చిత్రానికి చేరువవుతున్న నందమూరి బాలకృష్ణ కూడా తన చిత్రాన్ని అలాంటి రీతిలోనూ ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, విభిన్న కథాంశంతో...read more

Saturday, September 8, 2012

కార్మికుల ప్రాణాలంటే లెక్కలేదా?


                     
ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్యాల అక్రమాలు, అధికారుల అవినీతి పెనవేసుకుపోయి పరిశ్రమల్లో ప్రమాదాలను ఆనవాయితీగా మార్చేశాయి. స్వాతంత్య్రదినం రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో స్టీమ్‌కోర్‌ అలైస్‌లో సంభవించిన ఘోర ప్రమాదం యావత్‌ రాష్ట్రాన్ని, కార్మిక లోకాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో సలసల కాగుతున్న ఇనుప ద్రవం ఒంటి మీద పడి ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. మరో పది మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అదే రోజు హైదరాబాద్‌ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారత్‌ ఫ్లెక్సోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఎన్‌పి కెమికల్స్‌, కార్మోల్‌ డ్రగ్స్‌లో ప్రమాదాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగార్జున అగ్రికెమ్‌లో జరిగిన భారీ పేలుడు సంచలనం కలిగించింది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి 40 గ్రామాల ప్రజల జీవనం ప్రశ్నార్థకమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల చిట్టా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు, క్షతగాత్రులు కేవలం రెక్కల కష్టాన్ని, శారీరక శ్రమను నమ్ముకున్న వారే. పొట్ట చేత పట్టుకుని పనుల కోసం జిల్లాలు, రాష్ట్రాలు దాటి వస్తున్న నిరు పేదలు. వీరు చనిపోతే మృతుల వివరాలు సైతం బయటికి రావు. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించరు. ఎక్స్‌గ్రేషియా, పరిహారం వంటివి వారి దరి చేరవు. షాద్‌నగర్‌ ప్రమాదంలో మృతులు, గాయపపడ్డవారిలో ఎక్కువ మంది యుపి, బీహార్‌కు చెందిన వారే ఉండటం కార్మికుల దీన స్థితికి నిదర్శనం.
ప్రైవేటు యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ప్రభుత్వం బాధ్యతా రహితంగా చేతులు కట్టుకు కూర్చుంది. చాలా ఫ్యాక్టరీలకు కావాల్సిన అనుమతుల్లేవు. ప్రమాదాలను నివారించే, అప్రమత్తం చేసే చర్యలు శూన్యం. అగ్ని నిరోధక సాధనాలు నామమాత్రం. మాక్‌ డ్రిల్‌ ఊసే లేదు. కాలుష్య నియంత్రణ మండలి చోద్యం చూస్తోంది. ఫ్యాక్టరీలను తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగట్లేదు. ఫ్యాక్టరీ, కార్మిక, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక, తదితర ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అధికారుల అవినీతిలో యాజమాన్యాల అక్రమాలు కొట్టుకుపోతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అందాల్సిన సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. దీని వల్ల సకాలంలో వైద్యం అందక కార్మికులు చనిపోతున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం, వైద్యం, తదితర సౌకర్యాలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం ఎప్పుడూ మీనమేషాలే లెక్కిస్తోంది. చాలా సందర్భాల్లో యాజమాన్యాల కొమ్ముకాస్తోంది. ప్రమాదాలపై సకాలంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తే ఘోరాలు ఆగుతాయి. ప్రమాదాల నివారణకు పని ప్రదేశాల్లో ముందస్తు చర్యలు చేపడితే కార్మికుల ప్రాణాలను కాపాడే వీలుంది. ప్రభుత్వం అటువంటి చర్యలపై ఉదాసీనంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఆ వేడిలో హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకోనందువల్లనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏడాది క్రితం షాద్‌నగర్‌ మండలం కొత్తూరు వద్ద గల వినాయక స్టీల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పటి ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారిస్తున్న జైన్‌ కమిటీ డిజైన్‌, నాణ్యతా లోపాలను వదిలిపెట్టి ఉద్యోగులదే తప్పన్నట్లు చిత్రీకరిస్తోంది. సింగరేణిలోనూ పరిస్థితి ఇలానే ఉంది.

చంద్రబాబు పాదయాత్రకు అంతా సిద్ధం

                        
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ఏ పేరు అయితే బాగుంటుందోనని సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు. ప్రజా హితం లేదా జన హితం అనే పేరు పెడితే బాగుంటుందని కొందరు నాయకులు సూచించినట్టు తెలుస్తున్నది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినా, రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన ఈ దారుణ పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమం కాబట్టి ప్రజా హితం గాని లేదా జన హితం గాని బాగుంటుందని పెక్కుమంది అభిప్రాయపడుతున్నారు.

20 ఏళ్లకే 22 మంది పిల్లలు!

                                                          
నిజంగా హన్సిక చాలా గ్రేట్! పెద్ద పెద్ద మెగాస్టార్లు, స్టార్ హీరోయిన్లు, బడా నిర్మాతలు చేయలేని పనిని చాలా సింపుల్ గా చేసి చూపుతోంది ఈ అమ్మాయి. 20 ఏళ్ల వయసులోనే తన సేవా దృక్పథంలో 22 మంది చిన్నారులకు చ్చింది.read more

Friday, September 7, 2012

'శ్రీదేవి' ప్రత్యామ్నాయంగా తమన్నా!

80లలో జితేంద్ర యాంగ్రీ యంగ్ మ్యాన్ గా వెలుగొందుతున్న రోజుల్లో అతడి సూపర్ హిట్ సినిమా 'హిమ్మత్ వాలా' ఈ సినిమా అప్పట్లో బీభత్సమైన మాస్ హిట్. ఇదే సినిమా టైమ్ లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో వెలుగొందుతున్న హీరోయిన్ 'శ్రీదేవి'. హిమ్మత్ వాలా సాహసాలకు తోడు,read more

వైఎస్‌ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ

పాదయాత్ర అనుభవాలతో కూడిన వైఎస్‌ పాదయాత్ర డైరీని వైఎస్‌ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు చేతుల మీదుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరా ఆవిష్కరించారు. కొన్ని అంశాలతో కూడిన డైరీని read more

Thursday, September 6, 2012

‘ సుడిగాడు ‘చూసిన రజనీకాంత్‌

అల్లరి నరేష్‌ నటించిన సుడిగాడు సాధించిన ఘన విజయం తమిళనాడుకు పాకింది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సుడిగాడుని చూసేలా చేసింది.సుడిగాడును చూసేం దుకు చెన్నైలో ఏర్పాట్లు చేయాలని చిత్ర దర్శక నిర్మాతలను ఆయన కోరటంread more

Wednesday, September 5, 2012

కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ !


 రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ రానుందా.. అంటే అవుననిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించేందుకు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. ఇందుకు సంబంధించి ముంబైకి చెందిన ఓ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవ త్సరాల, 4 నెలలు పూర్తి అయింది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకువెళ్ళాలంటే తమకంటూ ప్రత్యేక ఛా నెల్‌ ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఛానెల్స్‌ ద్వారా పార్టీ కార్య క్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం సాధ్యం కా దు గనుక, రాష్ట్ర కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసు కుందని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో మంత్రు లు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తమ నియోజ కవర్గాల పరిధిలో చేస్తున్న కార్యక్రమాలను ఈ ఛానెల్‌ ద్వారా ప్రజలకు వివరిం చవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల మూసివేసిన ఓ ఛానెల్‌లో భాగస్వామి అయి, తద్వారా ఛానెల్‌ను పేరుమార్చకుండా యధావి ధిగా నిర్వహించాలని బొత్స ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రంగంలో అనుభవం ఉన్న బొత్సకు ఈ ఛానెల్‌ నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఇదిలాఉంటే గతంలో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడి ద్వారా సాక్షి దినపత్రిక, సాక్షి ఛానెల్‌ను ప్రారం భించినప్పటికీ, వైఎస్‌ మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ప్రత్యేక ఛానెల్‌ అంటూ లేకపోయింది. సీపీఎం తమ పార్టీ తరపున మరో రెండు నెలల్లో ఛానెల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇదిలాఉంటే సీపీఐ కూడా తమకూ ఓ ప్రత్యేక ఛానెల్‌ ఉండాలని యోచిస్తుంది.

ఇదే బాటలో పయనించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీగా ఉండి, ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉండికూడా ఏ రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేక ఛానెల్‌ లేకపోవడం కాంగ్రెస్‌కు కొంత వెలితిగా ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేరళలో పీసీసీకి ప్రత్యేక ఛానెల్‌ ఉందని, మన రాష్ట్రంలోకూడా ఉండాలని పార్టీ వర్గాలు కోరుతు న్నాయి. మంగళవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరో కొద్దినెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభు త్వం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. ఈ తరు ణంలో ఛానెల్‌ను ప్రారంభిస్తే స్థాని క సంస్థల ఎన్ని కలకు ముందే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మ రింత పటి ష్ఠంగా తీసుకెళ్ళవచ్చని పార్టీ వర్గాలు అంటు న్నాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు... సబ్సీడీమీద విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రూ.లక్ష వరకు వడ్డీ లేకుండా రుణాలు అందజేయడం వంటి పథకాలను సంక్షిప్త కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయాలని పార్టీ యోచిస్తుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా రెండు జతల యూనిఫారాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, వీటితోపాటు కంప్యూటర్‌ విద్య, ముస్లిం విద్యార్థినులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తే, పార్టీ గ్రామస్థాయిలో పటిష్ఠం అవుతుందని పార్టీవర్గాలు అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సహకార, మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స జిల్లాల్లో విరివిగా పర్యటిస్తుంటారు. ఆయా సందర్భాల్లో ఆక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పొల్లుపోకుండా ప్రజలకు చూపిస్తే, ప్రభుత్వం, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యా నిస్తున్నాయి.

Tuesday, September 4, 2012

అక్టోబర్‌ 11న ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’

 పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.  చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి.దానయ్యను వెల్లడించారు. ‘పవన్‌కళ్యాణ్‌ గారు పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన అభినయం హైలైట్‌గా ఉంటుంది. పూరి జగన్నాథ్‌గారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో, సూపర్‌సాంగ్స్‌తో, థ్రిల్లింగ్‌ యాక్షన్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రూపొందుతోంది. ఈ నెల 31తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌ రెండు పాటలు చిత్రీకరించడంతో, ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్‌లో, పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఇది ఓ బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది.

Monday, September 3, 2012

'శ్రీమన్నారాయణ' సక్సెస్‌మీట్‌

నందమూరి బాలకృష్ణ సినిమాఅంటే అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంబినేషన్‌లో విషయంకూడా అందులో ఉంటుంది. ఇటీవలే విడుదలైన 'శ్రీమన్నారాయణ' సినిమా గురించి ఆయన తన మనసులోని మాటను ఆవిష్కరించారు. ఈప్రాజెక్ట్‌ ఎనౌన్స్‌మెంట్‌ నుంచి విచిత్రమైన కాంబినేషన్‌ అనుకున్నారు. అదే విషయాన్ని బాలకృష్ణ చెప్పారు. ''రవి చావలి నన్ను కలవడానికి పడిన శ్రమను గుర్తించాను. ఓ సందర్భంలో కలిశారు. కథ చెప్పారు. ఆయన చెప్పిన విధానం, ఆయనపై నమ్మకం కల్గింది. దీనికితోడు ఘటికాచలం డైలాగ్స్‌ ఎలా ఉంటాయనే అనుకున్నారు. ఈయన బాలకృష్ణ సినిమాకు రాయగలుగుతాడా? లేదా? అని చాలామందిలో కలిగింది. ఆయన ఈ సినిమాలో గంభీరమైన డైలాగ్స్‌ రాశరు. కొత్త కాంబినేషన్‌. కానీ టాలెంట్‌ ఎక్కడ ఉంటే వారిని ప్రోత్సహించాలని శ్రీమన్నారాయణ సినిమా చేశాను'' అంటూ బాలకృష్ణ వెల్లడించారు. ఆదివారం రాత్రి శ్రీమన్నారాయణ సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ కలిసి కష్టపడిపనిచేశారు. హీరోయిన్లు బాగా నటించారు.. అంటూ... 'చలాకీ చూపుల్తో ఛూ మంత్రం వేశావే...' అంటూ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చిన చక్రి సింహా తర్వాత ఈ చిత్రానికి పని చేశాడని అన్నారు

Saturday, September 1, 2012

బంగారం ధర రోజురోజుకు సరికొత్త రికార్డు

బంగారం రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు దూసుకుపోవటంతో పాటు దేశీయంగా స్టాకిస్టులు భారీగా కొనుగోళ్లకు దిగటంతో శనివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరలు 550 రూపాయలు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 31,725 రూపాయలను తాకాయి. ఢిల్లీ బాటలోనే ముంబైలో కూడా 10 గ్రాముల బంగారం ధరలు 520 రూపాయలు పెరిగి 31,400 రూపాయలకు చేరుకోగా కోల్‌కతా, చెన్నైల్లో 540 రూపాయలు వృద్ధి చెంది వరుసగా 31,715 రూపాయలు, 31,575 రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా సాగింది. ఢిల్లీలో కిలో వెండి 2,250 రూపాయలు పెరిగి 59,500 రూపాయల వద్ద స్థిరపడగా ముంబైలో 2,000 రూపాయలు వృద్ధి చెంది 59,200 రూపాయల వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగటంతో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకాయని ట్రేడర్లు తెలిపారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ ఆర్ధిక వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధరలు ఐదు నెలల గరిష్ఠ స్థాయిలకు చేరుకోగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు స్పెయిన్ ప్రభుత్వం ఆమోదం తెలపటం ధరలు పెరగటానికి దోహదపడింది.

Friday, August 31, 2012

నాజూకు దేహానికి ఇదే లంచ్

healthy lunch ideas weight loss
సన్నగా... నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దానికోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. డైటింగ్ అంటుంది, జిమ్ అంటుంది, ఎక్సర్ సైజ్ అంటుంది. కానీ ఏ మాత్రం ఫలితం ఉండదు. పోషకాహారం అన్నది రోజు రోజుకీ ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే మనం తినే ఆహార పదార్థాలలో చిన్ని చని్న మార్పుల ద్వారా సన్నగా, ట్రిమ్ గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకొనే డిన్నర్ వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు.  
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, ఆరోగ్య కరమైన శరీరంతో జీవించగలుగుతారు. దాంతో మీ శరీరం ఫిట్ గా, చక్కటి ఆకృతిని కలిగి ఉంటారు. సన్నబడ్డానికి డైయట్ అంటూ రెండు పూటలా నోరు కట్టేయకుండా మూడుపూటలా తగిన మోతాదులో తీసుకొంటే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. అందుకోసం కొన్నిహెల్తీ న్యూట్రిషియన్ ఫుడ్ ను మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు మీ కోసం...


కేరళ: ఓ అద్భుతం


భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం కేరళ. తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం కేరళ సరిహద్దులుగా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. కేరళ భూభాగంలో 24% అటవీ ప్రాంతం ఆక్రమించుకుని ఉంది. ఇటీవలికాలంలో అడవులను వ్యవసాయభూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకొని కేరళ అడవులలో చాలా భాగాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించారు. 
దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో ఒకటైన కేరళ రాష్ట్రం 1956 నవంబర్ 1న అవతరించింది. భారత దేశంలోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన కేరళ రాష్ట్రంలో ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు సైతం అత్యధికంగానే ఉండటం దృరదుష్టకరం. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయిందని కొందరి అభిప్రాయం.
కేరళ రాజధాని తిరువనంతపురం, ఈ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అది 38,863 చ.కి.మీ విస్తీర్ణమైంది. కేరళ జీవవైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉన్నది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే దాదాపు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు సొంతం. సుమారు 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు సైతం అక్కడ పెరుగుతున్నాయి. 
కొల్లమ్ జిల్లా కోచి నీటికాలవలలో చీనా చేపలవల (చైనాలో తయారైనది). కేరళ తూర్పు భాగం పడమటి కనుమల వర్షచ్ఛాయప్రదేశానికి ఆనుకొని ఉన్నది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉన్నాయి. పడమటికి ప్రవహించే 41 నదులు, తూర్పుకు ప్రవహించే 3 నదులు ఇక్కడే ఆరంభమౌతాయి. పడమటి కనుమలు దాదాపు గోడకట్టినట్లున్నాయి. పాలఘాట్ సరస్సు దగ్గర మాత్రం ఖాళీస్థలం ఉన్నందున మిగిలిన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన ద్వారమయ్యింది. పడమటి కనుమల సగటు ఎత్తు 1,500 మీ. 2,500 మీ. ఎత్తైన శిఖరాలున్నాయి.
కనుమలకు ఆనుకొని పడమటి ప్రాంతంలో మధ్యకేరళ మైదానప్రాంతం ఉంది. ఇక్కడ ఎత్తుపల్లాల భూములు, లోయలు ఎక్కువ. 250 మీ, 1000మీ. మధ్య ఎత్తులున్న ఇక్కడి కొండలకు తూర్పు అంచున నీలగిరి కొండలు, పళని కొండలు, అగస్త్యమలై, అన్నామలై వంటి పర్వతప్రాంతాలు సైతం ఉన్నాయి.