http://apvarthalu.com/

Sunday, September 9, 2012

పక్కింటోళ్ల కోసమే పెళ్లి చేసుకొంటా!


రెండు రోజుల క్రితం విడుదలైన ‘జులాయి’ యావరేజ్‌ అనిపించుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఇలియానా పెద్ద మైనస్‌ అనే చర్చ జనాల్లో నడుస్తోంది.ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య పెద్దగా కెమిస్ట్రీ పండలేదని టాక్‌. సినిమాలో ఒకానొక సందర్భంలో హీరోయిన్‌ను ఉద్దేశించి అలీ ఇలా అంటాడు ‘కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్‌ అంబాసిడర్‌’లా ఉన్నా వని. ఆ మాటను నిజం చేస్తూ ఇలియానా పూర్తిగా పేషెంట్‌ మాదిరిగా ఉంది.read more

నా యాత్రకో పేరు కావాలి:చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టదలచిన పాదయాత్రకు ఓ పేరుNaidu to do a YSR with a 122-km yatraకావాలట. అక్టోబర్ రెండు నుంచి జనవరి 26 వరకు జరిగే పాదయాత్రకు పేరు సూచించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. ప్రజా యాత్ర, ప్రజాహిత యాత్ర వంటి పేర్లు నేతలు అప్పటికప్పుడు బాబుకు సూచించారు. పేరుతో పాటు పలు పేర్లను నాయకులు సూచించారు. read more

నిజాయితీగల నాయకులనే ఎన్నుకోవాలి…అన్నా హజారే

                                           
ప్రజాసేవ, వ్యక్తిత్వం ఆధారంగానే నాయకులను ఎన్నుకోవాలని సామాజిక వేత్త అన్నా హజారే ప్రజలను కోరారు. తాను ఎన్నికల్లో పాల్గొనబోనని, నిజాయితీగల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. నాయకులు తమ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. తాము చేసే ప్రతి పనికి ప్రజలకు జవాబు చెప్పగలగాలని ఆయన అన్నారు. తమ స్వంత గ్రామమైన రాలేగాలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాయితీ కలిగిన నాయకులు పార్లమెంటులో చాలా తక్కువమంది ఉన్నారన్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందడం కష్టమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన్ను అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోదియా, దినేష్‌ వాఘేలా కలిసారు. వివిధ అంశాలపై చర్చించారు.

రాఘవేంద్రరావు తనయుడు దర్శకత్వంలో బాలయ్య100వ చిత్రం

ఏ నటుడి సినీ జీవితంలోనైనా వందవ చిత్రమనేది ఓ మైలురాయిలా నిలిచిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. త్వరలో వందవ చిత్రానికి చేరువవుతున్న నందమూరి బాలకృష్ణ కూడా తన చిత్రాన్ని అలాంటి రీతిలోనూ ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, విభిన్న కథాంశంతో...read more

Saturday, September 8, 2012

కార్మికుల ప్రాణాలంటే లెక్కలేదా?


                     
ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్యాల అక్రమాలు, అధికారుల అవినీతి పెనవేసుకుపోయి పరిశ్రమల్లో ప్రమాదాలను ఆనవాయితీగా మార్చేశాయి. స్వాతంత్య్రదినం రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో స్టీమ్‌కోర్‌ అలైస్‌లో సంభవించిన ఘోర ప్రమాదం యావత్‌ రాష్ట్రాన్ని, కార్మిక లోకాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో సలసల కాగుతున్న ఇనుప ద్రవం ఒంటి మీద పడి ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. మరో పది మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అదే రోజు హైదరాబాద్‌ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారత్‌ ఫ్లెక్సోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఎన్‌పి కెమికల్స్‌, కార్మోల్‌ డ్రగ్స్‌లో ప్రమాదాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగార్జున అగ్రికెమ్‌లో జరిగిన భారీ పేలుడు సంచలనం కలిగించింది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి 40 గ్రామాల ప్రజల జీవనం ప్రశ్నార్థకమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల చిట్టా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు, క్షతగాత్రులు కేవలం రెక్కల కష్టాన్ని, శారీరక శ్రమను నమ్ముకున్న వారే. పొట్ట చేత పట్టుకుని పనుల కోసం జిల్లాలు, రాష్ట్రాలు దాటి వస్తున్న నిరు పేదలు. వీరు చనిపోతే మృతుల వివరాలు సైతం బయటికి రావు. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించరు. ఎక్స్‌గ్రేషియా, పరిహారం వంటివి వారి దరి చేరవు. షాద్‌నగర్‌ ప్రమాదంలో మృతులు, గాయపపడ్డవారిలో ఎక్కువ మంది యుపి, బీహార్‌కు చెందిన వారే ఉండటం కార్మికుల దీన స్థితికి నిదర్శనం.
ప్రైవేటు యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ప్రభుత్వం బాధ్యతా రహితంగా చేతులు కట్టుకు కూర్చుంది. చాలా ఫ్యాక్టరీలకు కావాల్సిన అనుమతుల్లేవు. ప్రమాదాలను నివారించే, అప్రమత్తం చేసే చర్యలు శూన్యం. అగ్ని నిరోధక సాధనాలు నామమాత్రం. మాక్‌ డ్రిల్‌ ఊసే లేదు. కాలుష్య నియంత్రణ మండలి చోద్యం చూస్తోంది. ఫ్యాక్టరీలను తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగట్లేదు. ఫ్యాక్టరీ, కార్మిక, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక, తదితర ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అధికారుల అవినీతిలో యాజమాన్యాల అక్రమాలు కొట్టుకుపోతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అందాల్సిన సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. దీని వల్ల సకాలంలో వైద్యం అందక కార్మికులు చనిపోతున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం, వైద్యం, తదితర సౌకర్యాలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం ఎప్పుడూ మీనమేషాలే లెక్కిస్తోంది. చాలా సందర్భాల్లో యాజమాన్యాల కొమ్ముకాస్తోంది. ప్రమాదాలపై సకాలంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తే ఘోరాలు ఆగుతాయి. ప్రమాదాల నివారణకు పని ప్రదేశాల్లో ముందస్తు చర్యలు చేపడితే కార్మికుల ప్రాణాలను కాపాడే వీలుంది. ప్రభుత్వం అటువంటి చర్యలపై ఉదాసీనంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఆ వేడిలో హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకోనందువల్లనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏడాది క్రితం షాద్‌నగర్‌ మండలం కొత్తూరు వద్ద గల వినాయక స్టీల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పటి ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారిస్తున్న జైన్‌ కమిటీ డిజైన్‌, నాణ్యతా లోపాలను వదిలిపెట్టి ఉద్యోగులదే తప్పన్నట్లు చిత్రీకరిస్తోంది. సింగరేణిలోనూ పరిస్థితి ఇలానే ఉంది.

చంద్రబాబు పాదయాత్రకు అంతా సిద్ధం

                        
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ఏ పేరు అయితే బాగుంటుందోనని సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు. ప్రజా హితం లేదా జన హితం అనే పేరు పెడితే బాగుంటుందని కొందరు నాయకులు సూచించినట్టు తెలుస్తున్నది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినా, రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన ఈ దారుణ పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమం కాబట్టి ప్రజా హితం గాని లేదా జన హితం గాని బాగుంటుందని పెక్కుమంది అభిప్రాయపడుతున్నారు.

20 ఏళ్లకే 22 మంది పిల్లలు!

                                                          
నిజంగా హన్సిక చాలా గ్రేట్! పెద్ద పెద్ద మెగాస్టార్లు, స్టార్ హీరోయిన్లు, బడా నిర్మాతలు చేయలేని పనిని చాలా సింపుల్ గా చేసి చూపుతోంది ఈ అమ్మాయి. 20 ఏళ్ల వయసులోనే తన సేవా దృక్పథంలో 22 మంది చిన్నారులకు చ్చింది.read more