http://apvarthalu.com/

Wednesday, December 12, 2012

యువరాజ్‌ ఓ ప్రత్యేకమైన పుట్టిన రోజు 12-12-12

క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు ఈరోజు ఓ ప్రత్యేకమైనది. ఆయన పుట్టిన రోజు డిసెంబరు 12 కావడం, మూడు పన్నెండులు రావడం, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు కావడంతో ఈరోజు యువీకి ప్రత్యేకమైన పుట్టిన రోజుగానే చెప్పవచ్చు. ఈరోజుతో యువీకి 31 ఏళ్లు నిండుతాయి. క్యాన్సర్‌ నంచి కోలుకున్న తరువాత ఆయన జరపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆయన కుటుంబసభ్యులే కాదు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన వ్యక్తిగా యువరాజ్‌ ఇప్పుడు ఆ వ్యాధిపై అవగాహన పెంచడానికి తన పుట్టిన రోజును కేటాయిస్తున్నాడు. యూ వుయ్‌ కెన్‌ పేరుతో తాను ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. స్నేహితులు తనకు మద్దతు ఇవావ్లని యువరాజ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Saturday, December 8, 2012

టాలీవుడ్ పై డ్రగ్స్ మత్తు!

ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం.. నేడు మాదకవూదవ్యాలకు అడ్డాగా మారింది. రోజు ఎక్కడో ఓ చోట డ్రగ్స్ వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస వివాదాలతో సతమవుతున్న సినిమా పరిశ్రమ డ్రగ్స్ కలకలంతో తలెత్తుకోలేకపోతోంది. యువత శక్తిని నిర్వీరం చేస్తున్న మాదక ద్రవ్యాలు సినిమా పరిశ్రమను వదల్లేదు. గ్లామర్ రంగంలో ఉన్న యువత సులభంగా డ్రగ్స్ కు అలవాటవుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు, యువ హీరోలు, హీరోయిన్లు, శ్రీమంతుల బిడ్డలు ఈ విష కౌగిలిలో చిక్కి పతనమైపోతున్నారు. ఖరీదైన హోటళ్లు, పబ్ లు, రిస్టార్టులు కేంద్రాలుగా డ్రగ్స్ చెలామణి అవుతున్నాయి. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని మాయా వలలు విసురుతున్నారు. పాశ్చాత్య మోజులో కొట్టుకుపోతున్న యువతను మత్తుకు ఈజీగా గులాములవుతున్నాయి. ఒక్కసారి ఈ వ్యసనానికి అలవాటుపడిన వారు బానిసలు మారుతున్నారు. red more

సాక్షికి మేత..సంబరాల్లో జగన్ పార్టీ

చంద్రబాబు నాయుడు – కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రజా బలం లేక చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఖాయమని, అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అని విలీనం కావడం ఖాయం అని చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఎఫ్ డీ ఐలకు సంబంధించి ఓటింగ్ లో పాల్గొనాల్సిన టీడీపీ ఎంపీలు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణిలు గైర్హాజరు కావడంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీలు ఆత్మ రక్షణలో పడిపోయారు.red more

తెలంగాణపై బాబు, జగన్ ఇరుక్కుపోయారా...

తెలంగాణపై ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న అఖిలపక్ష సమావేశాన్ని డిసెంబర్ 28న ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఏం చెబుతుందన్నది పక్కన పెడితే, ఇప్పుడు అతిపెద్ద సమస్య టీడీపీ, వైఎస్సార్ సీపీలకే. అఖిలపక్ష సమావేశాన్ని పెడితే, తమ పార్టీ తరపున ఒక్కరినే పంపి స్పష్టమైన అభిప్రాయం చెబుతామంటూ పాదయాత్రకు ముందే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాద్యత ఆయనపై ఉంది. మాట తప్పుదామంటే, తెలంగాణలో పాదయాత్ర చేస్తూ చంద్రబాబు ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లో సాగుతున్న ఆయనయాత్ర డిసెంబర్ 28 నాటికి ఇంకా తెలంగాణలోనే కొనసాగే అవకాశం ఉంది. అలాంటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అఖిలపక్షంలో నిర్ణయం ప్రకటిస్తే, పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అటు చంద్రబాబు రూట్లోనే పాదయాత్ర చేసుకొస్తున్న షర్మిల కూడా ఆ సమయానికి తెలంగాణలోనే ఉండొచ్చుred more

Monday, December 3, 2012

1000 కి.మీ పూర్తి చేసుకొన్న…వస్తున్నా…మీకోసం


సోమవారం ఉదయం జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండ పంటక్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు పెంటాఖుర్దులో 1000 కి.మీ మైలు రాయిని దాటారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపై మొదటి సంతకం, బెల్లు షాపుల రద్దుపై రెండో సంతకం ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ జిల్లాలో నిజాంసాగర్, మంజీరా ఉన్నా మంచినీళ్లకు తీవ్ర కొరత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ‘మంచినీళ్లు నిల్, మద్యం ఫుల్’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర మంచినీటి పథకాలు పెట్టి అన్ని గ్రామాలు, తండాలకు ఎన్టీఆర్ సృజల అనే కార్యక్రమంతో మంచినీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇవ్వదలిచామని ఆయన తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు ఉన్నా న్యాయం జరగలేదన్నారు.red more

Saturday, December 1, 2012

నిజంగా ప్రేమించడం అంటే ఏంటో!


ప్రియమైన సాటి ప్రేమికులందరికీ ప్రేమపూర్వక సుస్వాగతం... ఈ రోజుల్లో చాల మంది ప్రేమికులు తాము ప్రేమిస్తున్నామనే భావనలో ఉంటున్నారేకానీ నిజంగా ప్రేమించడం లేదు దాని చాల కారణాలు ఉన్నాయి..
వారికి నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలియకపోవడం, ఎలా ప్రేమించాలో తెలియకపోవడం, ప్రేమిస్తే ఎం చేయాలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం. ప్రేమలో ఎదుటి వాళ్ళు మన నుండి ఏం ఆశిస్తారో తెలియకపోవడం
ఇలా చాల కారణాలు ఉండొచ్చు...అలా అని వారి ప్రేమ స్వచ్చమైనది కాదు అని నేను అనను.. కానీ ప్రేమంటే పూర్తిగా తెలియకపోవడం వల్లనే వారి మద్య గొడవలు, అలకలు, విడిపోవడాలు జరుగుతున్నాయి.. ప్రేమలో ఎంత ఆనందం ఉంటుందో దానిలో తేడాలు వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ నరకం కనిపిస్తుంది..ఆలాంటి బాధని ఏ ప్రేమికులు అనుభవించకూడదు అన్న చిన్ని సంకల్పంతో ఒక చిన్ని ప్రయత్నాన్ని ఆరంబించబోతున్నాను..
ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి నేను సరిపోను కానీ నాకు తెలిసిన కాస్త ప్రేమ జ్ఞానాన్ని మీకు అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నం అంతే...
నా ఈ చిన్ని ప్రయత్నం వల్ల ఒక్క జంటలో మార్పు వచ్చిన సరే నా ఏ ప్రయత్నం సఫలం అయినట్టే.. అందరికి మహోన్నతమైన ప్రేమదొరకాలని ఆకాంక్షిస్తూ...........ప్రేమతో మీ..

జగన్‌ గెలిచినా కష్టాలు: జెసి దివాకర్ రెడ్డి


 కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలతో శనివారం అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో వారిని మీడియా చూసి జెసి కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు చేరిందా? లేక వైయస్సార్ కాంగ్రెసులో జెసి కాంగ్రెసు చేరిందా? అని ప్రశ్నించారు. అందుకు వైయస్సార్ కాంగ్రెసు నేతలు జెసి పేరులోనే జగన్ కాంగ్రెసు ఉందని చెప్పారు.
ఆ తర్వాత జెసి మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు 2014 తర్వాత సంవత్సరం పాటు సంతోషంగా ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే ఏడాది సంతోషంగా ఉన్నా ఆ తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
అంతకుముందు జెసి దివాకర్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కమిటీ ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తానని చెబితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి వస్తారని రాహుల్ టీం పరిశీలకులకు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు కంటే ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉందన్నారు. లోకసభ, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఒక్కరు కూడా పార్టీలో మిగులరని చెప్పారు. సిబిఐ కేసులు ఎత్తివేసి, ముఖ్యమంత్రిని చేస్తామంటే జగన్ వస్తాడన్నారు. అనంతపురం, హిందూపురం లోకసభ స్థానాలకు అభ్యర్థులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని చెప్పారు.